Pakistan: భారత్ చేతిలో ఓటమితో పాక్ బోర్డు అర్ధరాత్రి సంచలనం-ఇద్దరికి షాక్..!
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)లో భాగంగా కొలంబోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ (Pakistan) ఘోర పరాజయం పాలైంది. భారత్ విసిరిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 112 పరుగులకే చతికిల పడింది. కీలక ఆటగాళ్లు విఫలం కావడం, విజృంభిస్తారని లెక్కలేసుకున్న స్పిన్నర్లు హ్యాండ్ ఇవ్వడంతో చేసేది లేక పాకిస్తాన్ చేతులెత్తేసింది. దీంతో మరోసారి వరల్డ్ కప్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ కు దారుణ పరాభవం తప్పలేదు. దీని ఎఫెక్ట్ మ్యాచ్ జరుగుతుండగానే మొదలైంది.
భారత్ తో మ్యాచ్ లో ఓటమి తప్పదని తేలిపోవడంతో మధ్యలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛీఫ్, మంత్రి కూడా అయిన మొహసిన్ నక్వీ స్టేడియం నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఓటమి పాలు కాగానే స్వదేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. జనం టీవీలు పగులగొడుతున్న దృశ్యాలు, సోషల్ మిడియాలో తమ క్రికెటర్లను నానా తిట్లూ తిడుతున్న ట్వీట్లు, టీవీల్లో మాజీ క్రికెటర్లు ప్రస్తుత టీమ్ లో విఫలమైన ఆటగాళ్లతో పాటు పీసీబీ ఛీఫ్ పైనా దుమ్మెత్తి పోస్తున్న వీడియోలు ఇవాళ హల్ చల్ చేశాయి.

ఈ నేపథ్యంలో మరో కీలక విషయం బయటికి వచ్చింది. నిన్న భారత్ చేతిలో దారుణ ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు షాక్ లో ఉన్నారని ఆ జట్టు కోచ్ హెస్సెన్ వెల్లడించాడు. ఆ తర్వాత వారికి అర్ధరాత్రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరో షాకిచ్చింది. ఈ మ్యాచ్ లో పేలవ ఆటతీరుతో భారత్ కు మ్యాచ్ అప్పగించిన ఇద్దరు సీనియర్ క్రికెటర్లు బాబర్ ఆజం, షహీన్ షా అఫ్రిదిని తర్వాత మ్యాచ్ నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో నమీబియాతో మ్యాచ్ కు వీరి స్ధానాల్లో సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఫకర్ జమాన్, ఖవాజాల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
-
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!











Click it and Unblock the Notifications