చెత్త బౌలింగ్: క్లాస్ పీకిన హిట్మ్యాన్ !
బుధవారం రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా ఓటమికి యువ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా దారుణమైన బౌలింగ్ ప్రధాన కారణంగా నిలిచింది. 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తికి గురై.. మైదానం మధ్యలోనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్లు
భారత బౌలర్లు ఇద్దరూ ఈ మ్యాచ్లో భారీగా పరుగులు ఇచ్చారు: హర్షిత్ రాణా 10 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు సమర్పించుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు సులభంగా బౌండరీలు కొట్టడానికి అవకాశం ఇచ్చిన వీరి చెత్త బౌలింగ్ను చూసి రోహిత్ శర్మ కోపం పట్టలేకపోయాడు. ఈ ఘటన సౌతాఫ్రికా ఛేజింగ్లో 37వ ఓవర్ సమయంలో జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ బ్రీట్జ్కే ఫోర్ కొట్టిన తర్వాత ఒక డాట్ బాల్ వేశాడు. తరువాత బంతి వేయడానికి ప్రసిద్ధ్ తన బౌలింగ్ మార్క్ వద్దకు వెళ్తున్న సమయంలో, రోహిత్ శర్మ అతడిని అక్కడే ఆపేశాడు. వెంటనే హర్షిత్ రాణాను కూడా పిలిపించిన రోహిత్.. ఇద్దరు యువ పేసర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రోహిత్ చేతి సైగలు, ముఖ కవళికలు చూస్తుంటే వారిద్దరి లైన్ అండ్ లెంగ్త్పై.. ముఖ్యంగా బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్లకు ప్రసిద్ధ్ వేస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సులభంగా పరుగులు రాకుండా ఎలా కట్టడి చేయాలో వారికి గట్టిగా క్లాస్ పీకాడు. కెప్టెన్ నుంచి గట్టి మందలింపు విన్న తర్వాత, ప్రసిద్ధ్ కృష్ణ ఆ ఓవర్ను బాగా ముగించాడు. చివరి రెండు బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. అయితే ఆ ఓవర్ మొత్తం 16 పరుగులతో ముగిసింది. అప్పటివరకు ప్రసిద్ధ్ తన ఆరు ఓవర్లలో కేవలం ఒక వికెట్ తీసి 64 పరుగులు ఇచ్చాడు.
మ్యాచ్ సారాంశం
రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, విరాట్ కోహ్లి (102), రుతురాజ్ గైక్వాడ్ (105)ల శతకాలతో పాటు కేఎల్ రాహుల్ అజేయంగా చేసిన 66 పరుగుల సహకారంతో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ-గైక్వాడ్ జోడీ 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, సౌతాఫ్రికాపై వన్డేలలో భారత్కు మూడో వికెట్కు అత్యధిక భాగస్వామ్య రికార్డును సృష్టించింది.
అనంతరం 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తరఫున ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (110) సూపర్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు మాథ్యూ బ్రీట్జ్కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) వేగంగా అర్థ శతకాలు నమోదు చేశారు. ముఖ్యంగా బ్రెవిస్ కేవలం 34 బంతుల్లో 54 పరుగులు చేసి, ఐదు సిక్సర్లు కొట్టి భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు.చివరిలో కార్బిన్ బాష్ మెరుపు ఇన్నింగ్స్తో సౌతాఫ్రికా తమ సొంతగడ్డ వెలుపల అత్యధిక ఛేజింగ్ రికార్డును సాధించి, సిరీస్ను 1-1తో సమం చేసింది. డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరగనున్న మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు ఉత్సాహంతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications