IPL: RCB రీటెయిన్ చేసుకునే ఆటగాళ్ల జాబితా..ఆ ప్లేయర్లకు షాక్..?
RCB:ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పంజాబ్ కింగ్స్పై గెలుపొంది 17 ఏళ్ల తర్వాత తొలి ట్రోఫీని గెలుచుకుంది. కర్ణాటక మాత్రమే కాకుండా దేశం మొత్తం ఈ విజయాన్ని ఆనందంగా జరుపుకుంది. అయితే, ఆ మరుసటి రోజు బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విక్టరీ వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. దీని తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడం ఆర్సీబీ ట్రోఫీ గెలుపు సంబరాన్ని విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనకు సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నగర పోలీసు కమిషనర్తో సహా పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, ఆర్సీబీ, కేఎస్సీఏలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, విరాట్ కోహ్లీపైనా కేసు నమోదైంది.

ఆ తర్వాత ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేస్తారనీ, బ్యాన్ చేస్తారనే పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించాయి. దీనిపై ఫ్రాంచైజీ స్పష్టతనిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మేది లేదని తేల్చి చెప్పింది. తద్వారా ఆ పుకార్లకు అడ్డుకట్ట వేసింది.
ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
ఇప్పుడు 19వ సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఎవరు ఉంటారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది. బలమైన జట్లపై విజయం సాధించి ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి 17 ఏళ్ల తర్వాత ఛాంపియన్గా నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఈసారి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బాగుంది. ఎవరిని ఏ స్థానంలో ఆడిస్తే బాగుంటుందనే ముందస్తు ప్రణాళిక కూడా జట్టు సక్సెస్లో కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే అనుకున్నదాని కంటే ఉత్తమ ఆటగాళ్లు ఉండటంతో వారిని కొనసాగించి కొందరిని మాత్రం వదులుకోనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
ఆర్సీబీలో కొనసాగే ఆటగాళ్లు:
- రజత్ పాటిదార్ (కెప్టెన్)
- విరాట్ కోహ్లీ
- ఫిల్ సాల్ట్
- జాకోబ్ బెథెల్
- మయాంక్ అగర్వాల్
- జితేష్ శర్మ
- కృనాల్ పాండ్యా
- టిం డేవిడ్
- రోమారియో షెఫర్డ్
- జోష్ హేజిల్వుడ్
- సుయాష్ శర్మ
- భువనేశ్వర్ కుమార్
- యష్ దయాళ్
- నువాన్ తుషార
- లుంగి ఎన్గిడి
- మనోజ్ భండగే
- స్వప్నిల్ సింగ్
- స్వస్తిక్ చికార
RCB రిలీజ్ చేయనున్న ఆటగాళ్ల జాబితా:
- లియామ్ లివింగ్స్టోన్
- అభినందన్ సింగ్
- రాసిఖ్ సలామ్ దార్
- మోహిత్ రాథి
- బ్లెస్సింగ్ ముజరబానీ
- టిమ్ సీఫెర్ట్
ఈసారి ఆర్సీబీ తరఫున ఆడిన చాలా మంది ఆటగాళ్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి మినీ వేలానికి ముందు కొద్ది మంది ఆటగాళ్లను మాత్రమే వదులుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఆర్సీబీ జట్టు కసరత్తులు చేస్తోంది. జట్టు కూర్పుపై దృష్టి సారించింది.
-
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications