రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! (వీడియో)
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఘనవిజయం సాధించి మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన వేళ దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. అయితే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గెలుపు సంబరాలు జరుగుతున్న సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితికా సజ్దేహ్ల మధ్య జరిగిన ఓ చిన్న గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
వీడియోలో ఏముంది?
టీమిండియా విజయోత్సవాల్లో మునిగిపోయి ఉన్న సమయంలో రోహిత్ శర్మపై రితికా సీరియస్గా ఏదో చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. స్టేడియంలో విపరీతమైన గోల ఉండటంతో ఆమె గట్టిగా అరుస్తూ రోహిత్ను మందలిస్తున్నట్లు ఉండటం చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రోహిత్ మాత్రం ఆమె మాటలకు నీరసంగా స్పందిస్తూ కనిపించాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అని అభిమానులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.

గొడవ కాదు.. అది 'హై వాల్యూమ్' గోల!
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే నిజానికి వీరి మధ్య గొడవ జరగలేదని, స్టేడియంలో ఉన్న భారీ శబ్దం వల్ల రితికా గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే రితికా నవ్వుతూ రోహిత్తో సరదాగా గడపడం కూడా అదే వీడియోలో చూడవచ్చు. రోహిత్ శర్మకు ఏవైనా సూచనలు ఇస్తూ రితికా అలా గట్టిగా మాట్లాడి ఉండవచ్చని సమాచారం.
Rohit Sharma doesn’t seem to agree with something Ritika bhabhi is saying, but she is trying her best to explain it to him today at Narendra Modi Stadium.😂❤️
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 8, 2026
Best Jodi my favourit🫂❤️ pic.twitter.com/MmEymgymDm
నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. "ప్రపంచకప్ గెలిచినా భార్య మాట వినాల్సిందే.. అది రోహిత్ భాయ్కైనా తప్పదు!" అని ఒకరు కామెంట్ చేయగా.."మహిళా దినోత్సవం సందర్భంగా భార్యలు చెప్పింది వినక తప్పదు మరి" అని ఇంకొకరు చమత్కరించారు."కుటుంబంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమే" అంటూ ఫ్యాన్స్ రోహిత్కు మద్దతుగా నిలుస్తున్నారు.
కెప్టెన్ సూర్య కెప్టెన్సీలో అద్భుతం
రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను డిఫెండ్ చేసుకుని చరిత్ర సృష్టించింది. కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, సూర్య కెప్టెన్సీ వెరసి భారత్ను మళ్ళీ ఛాంపియన్గా నిలబెట్టాయి. రోహిత్ తన వంతు సహకారాన్ని అందిస్తూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications