శ్రేయస్ అయ్యర్ గాయంపై కీలక అప్‌డేట్: ఫ్యాన్స్‌కు ఎమోషనల్ మెసేజ్!

Shreyas Iyer Health Update: ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అలెక్స్ కేరీ క్యాచ్ పడుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావాన్ని ఆపడానికి వైద్య చికిత్స జరిగింది. ప్రస్తుతం అయ్యర్ పరిస్థితి నిలకడగా ఉంది. అయితే అతను మరో రెండు నెలలపాటు క్రికెట్ మైదానంలోకి తిరిగి రాలేడని రిపోర్టులు సూచిస్తున్నాయి. పక్కటెముకలకు గాయం కావడం వల్ల అంతర్గత రక్తస్రావాన్ని ఆపడానికి ఈ ఆపరేషన్ నిర్వహించారు. శ్రేయస్ అయ్యర్ తన గాయం గురించి స్వయంగా ఒక అప్‌డేట్ కూడా ఇచ్చారు.

వచ్చే రెండు నెలలు దూరం.. టీ20 ప్రపంచ కప్ కూడా కష్టమే!
ఓ నివేదిక ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ వచ్చే రెండు నెలల వరకు క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడలేడు. అంతేకాకుండా జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ స్వదేశానికి రావడంపై కూడా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఒకవేళ తిరిగి వచ్చినా.. ప్రాక్టీస్‌కు సమయం తక్కువగా ఉండటం వల్ల టీ20 ప్రపంచ కప్ ప్రణాళికల్లో శ్రేయస్ భాగమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే టీ20 ప్రపంచ కప్‌కు ముందు జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లే చివరివి. వాటిలో జట్టు యాజమాన్యం తుది 15 మంది ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలని అనుకుంటోంది.

Shreyas Iyer Health Update Emotional Message to Fans After Surgery Return Timeline Revealed

ఐపీఎల్ 2026 ద్వారా మైదానంలోకి రీఎంట్రీ?
శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైతే అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అతను దాదాపు 7 నెలలు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ వచ్చే ఏడాది జులైలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా మాత్రమే టీమిండియాలోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకుముందే శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ద్వారా మైదానంలోకి తిరిగి రావచ్చని తెలుస్తోంది.

స్వయంగా అప్‌డేట్ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్
తన గాయంపై శ్రేయస్ అయ్యర్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నేను ప్రస్తుతం రికవరీ ప్రక్రియలో ఉన్నాను. కాలం గడిచే కొద్దీ మెరుగవుతున్నాను. నాకు అందిన శుభాకాంక్షలు, మద్దతుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇది నిజంగా నాకు చాలా విలువైనది. ధన్యవాదాలు."అంటూ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు.

ప్లీహానికి గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం
గత శనివారం సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో అలెక్స్ కేరీ క్యాచ్ పడుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. గాయం తర్వాత ఫిజియోతో కలిసి అతను మైదానం వీడాడు. పరిస్థితి విషమించడంతో సిడ్నీలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. మెడికల్ స్కానింగ్‌లో ప్లీహానికి గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు తేలింది. ప్లీహానికి గాయం కారణంగా అంతర్గత రక్తస్రావాన్ని ఆపడానికి 'వైద్య ప్రక్రియ' అవసరమని బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా అప్పట్లో తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+