శ్రేయాస్ అయ్యర్ పంట పండింది..ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు..!
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్-2025కు సంబంధించిన మెగా వేలం ఆదివారం మొదలైంది. మొత్తం 577 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలం నేడు, రేపు జరగనుండగా.. అత్యధిక స్టార్ ప్లేయర్లను ఆయా పాత జట్లు రిటైన్ చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యార్ ఏకంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను దక్కించుకున్నాడు.
ప్రస్తుతం శ్రేయాస్ ధర రూ. 18 కోట్లకు చేరుకుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోరాడాయి. పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. చివరిదాకా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ధరకు చేతులెత్తేసింది. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ వశం అయ్యాడు.శ్రేయాస్ అయ్యర్కు పంజాబ్ జట్టు పగ్గాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

బౌలర్ అర్షదీప్ సింగ్ సైతం జాక్ పాట్ కొట్టాడు. అర్షదీప్ సింగ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి.ఈక్రమంలోనే 15. 75 కోట్లకు హైదరాబాద్ వేలంలో దక్కించుకోగా.. పంజాబ్ జట్టు అతన్ని రూ. 18 కోట్లకు రైట్ టు మ్యాచ్ పద్ధతి ద్వారా తిరిగి అర్షదీప్ సింగ్ను సొంతం చేసుకొంది. దీంతో అర్షదీప్ సింగ్ 18 కోట్లకు అమ్ముడుపోయి జాక్ పాట్ కొట్టాడు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications