Ind-Nz ODI: కివీస్ తో వన్డేలకు ఆ ఇద్దరు స్టార్లు అవుట్..! బీసీసీఐ కీలక నిర్ణయం..!
భారత్-న్యూజీలాండ్ మధ్య వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్ కు బీసీసీఐ సెలెక్టర్లు ఇవాళ జట్టును ప్రకటించబోతున్నారు. ఇందులో పలు సంచలనాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం కివీస్ తో వన్డే సిరీస్ కు ఇవాళ ప్రకటించే జట్టులో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. ఇప్పటికే విశ్రాంతి లేకుండా ఫార్మాట్లతో సంబంధం లేకుండా వరుస మ్యాచ్ లు ఆడుతున్న వీరిద్దరికీ ఈసారి కివీస్ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
జనవరి 11, 14,18 తేదీల్లో న్యూజీలాండ్ తో వడోదర, రాజ్ కోట్, ఇండోర్ లో భారత్ మూడు వన్డేలు ఆడబోతోంది. ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఆడే భారత జట్టును ఇవాళ సెలెక్టర్లు ప్రకటిస్తారు. అయితే ఇందులో స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకూ కూడా విశ్రాంతినిస్తారని తెలుస్తోంది. దీని వెనుక రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. రాబోయే టోర్నీల్ని దృష్టిలో ఉంచుకునే వీరికి ఈ రెస్ట్ ఇవ్వబోతున్నారు.

న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ ముగిశాక ఐదు టీ20ల సిరీస్ ఉంది. ఇది ముగిశాక టీ20 వరల్డ్ కప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రెండు కీలక టోర్నీలకు బుమ్రా, పాండ్యా గాయాలు కాకుండా అందుబాటులో ఉండాలంటే వీరిద్దరికీ వన్డేల నుంచి విశ్రాంతి నివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే కివీస్ లో వన్డే సిరీస్ లో ఆడకుండా విశ్రాంతి తీసుకునేలా వీరిని ప్రోత్సహించే అవకాశం ఉంది. అప్పుడే కివీస్ తో టీ20 సిరీస్ తో పాటు టీ20 వరల్డ్ కప్ లోనూ వీరిద్దరి సేవల్ని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. కివీస్ తో టీ20 సిరీస్ లో భాగంగా భారత్ జనవరి 21,23, 25, 28, 31 తేదీల్లో ఆదు మ్యాచ్ లు ఆడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ టీ20 వరల్డ్ కప్ ఉంటుంది.
-
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications