టీ20 మహిళల వరల్డ్ కప్-2024 విజేత న్యూజిలాండ్
టీ20 వరల్డ్ కప్-2024 ఛాంపియన్స్గా న్యూజిలాండ్ మహిళల జట్టు నిలిచింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కీవీస్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా తొలిసారి ప్రపంచకప్ టైటిల్ను న్యూజిలాండ్ తన ఖాతాలో వేసుకుంది. 159 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఓవర్లన్నీ ఆడి 126-9 స్కోర్కే పరిమితమైంది.
లారా వోల్వార్ట్ (33 పరుగులు) మాత్రమే రాణించింది. దీంతో సౌతాఫ్రికా జట్టు రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లలో అమెలియా కేర్, రోస్మెరీ చెరో 3, కర్సన్, జొనాస్, బ్రూక్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అమెలియా కేర్ (43 పరుగులు), బ్రూకీ (38 పరుగులు) సూజీ బీట్స్ (32 పరుగులు) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో నొంకులెకొ 2, డి క్లర్క్, అయబొంగ, చొలే తలో వికెట్ తీశారు.
👑 CHAMPIONS 👑
— ICC (@ICC) October 20, 2024
New Zealand win their maiden Women's #T20WorldCup title 🏆#WhateverItTakes #SAvNZ pic.twitter.com/DOfyWZgLUf
కాగా, ఇప్పటివరకు అత్యధికంగా ఆస్ట్రేలియా (2010, 2012, 2014, 2018, 2020, 2023) ఆరుసార్లు టైటిల్ దక్కించుకోగా, ఇంగ్లాండ్ (2009), వెస్టిండీస్ (2016) ఒక్కోసారి ఛాంపియన్గా నిలిచాయి. ఇక తాజాగా ఛాంపియన్స్ జాబితాలోకి న్యూజిలాండ్ చేరిపోయింది.
మరోవైపు, న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నిలిచింది. 2006లో అరంగేట్రం చేసిన బేట్స్ 18ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు 334 మ్యాచ్లు ఆడింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ రికార్డ్ను ఆమె బ్రేక్ చేసింది. టీమ్ఇండియాకు దాదాపు రెండు దశాబ్దాల కాలంలో మిథాలీ 333 మ్యాచ్లు ఆడింది. కాగా, టైటిల్ బరిలో ఉన్నామంటూ వచ్చిన టీమిండియా మహిళల జట్టు సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. అయితే, పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీలోనూ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టు భారత్ చేతిలో ఓటమిపాలై రన్నరప్ నిలిచింది.












Click it and Unblock the Notifications