కేఎల్ రాహుల్, సిరాజ్ అవుట్: టీ20 వరల్డ్ కప్ ఆడబోయే టీమిండియాపై లారా అంచనాలు

T20 World Cup 2024 India squad: ఐపీఎల్ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అయింది. ఎనిమిది విజయాలు- 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందా జట్టు.

పదేసి చొప్పున పాయింట్లను సాధించిన కోల్‌కత నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఆ తరువాతి స్థానాలో నిలిచాయి. ఏకంగా అయిదు జట్లు దాదాపుగా ఒకేరకమైన నెట్ రన్‌రేట్‌ను సాధించాయి. ఫలితంగా- నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించాల్సిన ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది.

T20 World Cup 2024 Brain Lara picks his Indian team

ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌ ఆడబోతోంది భారత జట్టు. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌.. ఇందులో ఉన్నాయి.

ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును మే 1వ తేదీన ప్రకటించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. దీనిపై ఇప్పటికే ఓ ఫార్మల్ మీటింగ్ సైతం ముగిసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కేప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు కూడా. వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టు కసరత్తు సాగిస్తోన్నారు.

టీ20 వరల్డ్ కప్ ఆడబోయే దేశాల క్రికెట్ బోర్డులన్నీ కూడా మే 1వ తేదీ నాటికి తమ ప్లేయర్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. దీనిపై ఇదివరకే ఐసీసీ ఆయా బోర్డులకు సమాచారాన్ని పంపించింది. ఈ నేపథ్యంలో టీమిండియా కూర్పుపై ఉత్కంఠత నెలకొంది.

గడువు సమీపించిన నేపథ్యంలో- భారత జట్టుపై ఇప్పుడిప్పుడే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. లెజెండరీ క్రికెటర్లు, టీమిండియా మాజీ ప్లేయర్లు, స్పోర్ట్స్ కామెంటేటర్లు.. టీమిండియాలో చోటు దక్కించుకోబోయే వారి గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తోన్నారు. జట్టు కూర్పు ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటే కప్‌ను సాధించగలుగుతుందనే అంశాలపై సమాచారాన్ని పంచుకుంటోన్నారు.

ఇప్పటికే బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్, టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్.. భారత జట్టు కూర్పుపై తన అంచనాలను వెల్లడించారు. తాజాగా వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ బ్రియాన్ లారా టీమిండియా ఎంపికలపై తన అభిప్రాయాలను తెలియజేశారు.

టీ20 వరల్డ్ కప్ ఆడబోయే భారత జట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ, శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, మయాంక్ యాదవ్‌ను తీసుకోవాలని బ్రియాన్ లారా సూచించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+