Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'45 రోజులు నిద్రలేని రాత్రులు': కంటతడి పెట్టిన స్మృతి మంధాన (వీడియో)

Smriti Mandhana: భారత మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన తర్వాత స్మృతి మంధాన ఆనందంలో మునిగిపోయింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన అనంతరం వైస్ కెప్టెన్ స్మృతి మంధాన భావోద్వేగానికి లోనైంది. దశాబ్దాలుగా వెంటాడిన గుండెకోతను ఈ విజయం అంతం చేసింది. గతంలో భారత్ రెండుసార్లు 2005, 2017లో ఫైనల్ చేరుకున్నా హృదయవిదారక ఓటములను చవిచూసింది. ఈ సారి సొంతగడ్డపై కోట్లాది మంది అభిమానుల మధ్య ఆడుతున్న టీమిండియా ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని నిశ్చయించుకుంది.

ఫైనల్ మ్యాచ్‌కి ఓ అద్భుతమైన ముగింపు లభించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 52 పరుగుల తేడాతో గెలిచి, దేశమంతటా ఆనందోత్సాహాలను నింపింది. ప్రపంచకప్‌ గెలవాలంటే జట్టు మొత్తం అద్భుతమైన కృషి చేయాలి. 2025 ఎడిషన్‌లో భారత్ సరిగ్గా అదే చేసింది. ప్రతి క్రీడాకారిణి ముఖ్యమైన సహకారాన్ని అందించింది.

Tearful Smriti Mandhana Reflects After India Historic World Cup Win Video Goes Viral

స్మృతి మంధాన 434 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంలో జెమీమా రోడ్రిగ్స్ (127), హర్మన్‌ప్రీత్ కౌర్ (89) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీప్తి శర్మ 22 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఇందులో ఫైనల్‌లో 5 వికెట్ల ప్రదర్శన, ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. అమన్‌జోత్ కౌర్, రిచా ఘోష్, ముఖ్యంగా షెఫాలీ వర్మ కూడా కీలక పాత్ర పోషించి భారత్‌కు చరిత్ర సృష్టించడంలో సహాయపడ్డారు.

మంధాన కళ్లలో ఆనంద బాష్పాలు
ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిలబడటం అంటే ఏమిటో వివరించే ప్రయత్నంలో స్మృతి మంధాన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లోనే.. "ప్రపంచ ఛాంపియన్‌గా నిలబడటంపై ఎలా స్పందించాలో నాకు తెలియడం లేదు. ఇది ఇంకా నా మనసులో నిదానంగా జీర్ణమవుతోంది. క్రికెట్ మైదానంలో నేను ఎప్పుడూ ఇంత భావోద్వేగానికి లోను కాలేదు, కానీ ఇది చాలా అవాస్తవమైన క్షణం. సొంతగడ్డపై ప్రపంచకప్ గెలవడం. 'ఛాంపియన్స్ - ఇండియా' అని చదవడాన్ని నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను. ప్రతి ప్రపంచకప్‌కు మేము వెళ్లినప్పుడల్లా ఎన్నో గుండెకోతలు ఎదురయ్యాయి. కానీ మహిళల క్రికెట్‌ సంబంధించి మాపై కీలక బాధ్యత ఉందని మేము ఎప్పుడూ నమ్ముతాం. గత 45 రోజులుగా మాకు లభించిన మద్దతును చూస్తే... గత 40 రోజులు ఎలా గడిచిపోయాయో వివరించడం కష్టం. కానీ ఈరోజు ప్రపంచకప్ విజయంతో ఈ ప్రయాణాన్ని ముగించడం కోసం, ఆ 45 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను." అని స్మృతి మంధాన పేర్కొన్నారు.

"గత టీ20 ప్రపంచకప్ మా అందరికీ కష్టమైంది. కానీ మేము మా ఫిట్‌నెస్‌పై పనిచేయడం, ప్రతి అంశంలో మెరుగ్గా ఉండటంపై స్పష్టమైన దృష్టి పెట్టాం. ఈ జట్టు సూపర్-స్ట్రెంత్ ఏమిటంటే - ఎవరూ దాని గురించి ఎక్కువగా మాట్లాడరు - కానీ అందరూ ఒకరికోసం ఒకరు నిలబడటం, ఒకరికొకరు ఆడుకోవడం. ప్రపంచకప్‌లో మాకు ప్రతి ఒక్కరి మద్దతు అవసరం. మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి. మేము ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించాం. జట్టు వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను... అది కేవలం మాజిక్!" అని మంధాన అన్నారు.

భారత్ ప్రయాణం ఎగుడుదిగుడుగా సాగింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిపోయి.. న్యూజిలాండ్‌ను ఓడించి కష్టంగా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్‌లో 298 పరుగులను సమర్థించుకుని దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ చరిత్ర సృష్టించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+