టీమిండియా.. మేమంతా మీతోనే..: ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇలా
అహ్మదాబాద్: 1983, 2011 తర్వాత మూడోసారి 2023లో టీమిండియా.. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీ తన సొంతం చేసుకుంటుందనుకున్న కోట్లాది మంది భారత అభిమానుల హృదయాలు బద్దలయ్యాయి. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియాపై ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. దీంతో భారత ఆటగాళ్లతోపాటు అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.
Dear Team India,
— Narendra Modi (@narendramodi) November 19, 2023
Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
కాగా, వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనను కనబర్చిన టీమిండియా ఆటగాళ్లకు అంతా అండగా నిలుస్తున్నారు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీలో టీమిండియా ప్రదర్శన పట్ల క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు సానుకూలంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియాకు మద్దతుగా ఉన్నామన్నారు.

'డియర్ టీమిండియా ఈ ప్రపంచ కప్లో మీ ప్రదర్శన, కప్ సాధించాలనే మీ సంకల్పం ఎంతో విశేషమైనవి. గొప్ప స్ఫూర్తితో మ్యాచ్లు ఆడారు. దేశానికి ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టారు. మేము ఈ రోజు, ఎల్లప్పుడూ మీతో ఉంటాం' అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోవైపు, వరల్డ్ కప్ 2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్లో ప్రశంసనీయమైన ప్రదర్శన చేశారని, అద్భుతమైన విజయంతో ముగించారని మోడీ పేర్కొన్నారు. అద్భుతమైన సెంచరీ నమోదు చేసిన ట్రావిస్ హెడ్కు అభినందనలు తెలియజేశారు.

ఆసీస్కు వరల్ కప్ అందించిన ప్రధాని మోడీ, ఆసీస్ డిప్యూటీ పీఎం
దాదాపు 45 రోజుల పాటు సాగిన వరల్డ్ కప్ సంరంభం ఆదివారంతో ముగిసింది. పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్కు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్కు వరల్డ్ కప్ను బహూకరించారు. 6వ సారి వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టును వారు అభినందించారు.
My admiration and respect for our warriors of the Indian Cricket Team for their incredible journey in the 2023 Cricket World Cup.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 19, 2023
Although the match didn’t go in our favour, their spirit, sportsmanship and innumerable moments through this journey have greatly inspired the entire…
టీమిండియాకు మద్దతుగా సీఎం జగన్ ట్వీట్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగాపై స్పందించారు. 2023 వరల్డ్ కప్లో మన క్రికెటర్లు మంచి పోరాట పటిమను చూపించారు. మ్యాచ్ మనకు అనుకూలంగా లేకపోయినా వారి క్రీడా స్ఫూర్తి, యావత్ దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. టీమిండియా దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది అని జగన్ వ్యాఖ్యానించారు. మరోవైపు, టీడీపీ నేత నారా లోకేష్ కూడా టీమిండియా పోరాట స్ఫూర్తి ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications