బంపరాఫర్: ప్రపంచకప్ విన్నర్కు కాసుల వర్షం
WPL 2026 Auction: ఢిల్లీలో మహిళా ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ భారీ ధర పలికింది. ఈ స్టార్ ప్లేయర్ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్(RTM) కార్డును ఉపయోగించి దీప్తి శర్మను సొంతం చేసుకుంది. దీప్తి శర్మ కోసం జరిగిన బిడ్డింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.3.2 కోట్ల వరకు తమ బిడ్ను పెంచింది.
ఢిల్లీ క్యాపిటల్స్ వేసిన ఈ చివరి బిడ్కు అడ్డుకట్ట వేస్తూ, యూపీ వారియర్స్ జట్టు తమ వద్ద ఉన్న రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించింది.దీంతో దీప్తి శర్మను రూ. 3.2 కోట్ల భారీ ధరకు యూపీ వారియర్స్ జట్టు తిరిగి సొంతం చేసుకుంది.ప్రపంచకప్ను గెలిచిన కొద్ది రోజులకే దీప్తి శర్మకు ఈ భారీ మొత్తం దక్కడం ఆమె కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి దీప్తి శర్మ డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన భారతీయ క్రీడాకారుల జాబితాలో తన సహచర క్రీడాకారిణి స్మృతి మంధాన (రూ. 3.4 కోట్లకు RCB సొంతం చేసుకుంది) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర.. వేలంలో కోట్లు
ఈ మెగా వేలానికి ముందు యూపీ వారియర్స్ దీప్తిని రిలీజ్ చేసింది. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ గాయం కారణంగా గత సీజన్లో లేకపోవడంతో దీప్తి శర్మ జట్టుకు నాయకత్వం వహించింది.డబ్ల్యూపీఎల్ 2026 వేలానికి ముందు 2025 మహిళల వన్డే ప్రపంచకప్లో దీప్తి అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆమె భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో దీప్తి శర్మ ఒక మ్యాచ్-డిఫైనింగ్ అర్ధ సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీసి జట్టు విజయాన్ని సులభతరం చేసింది. ఆమె టోర్నమెంట్ను 215 పరుగులు, 22 వికెట్లతో ముగించింది. మొత్తం మూడు డబ్ల్యూపీఎల్ సీజన్లలో దీప్తి 25 మ్యాచ్ల్లో 507 పరుగులు చేసి, 27 వికెట్లు పడగొట్టింది. ఆమె తిరిగి యూపీ వారియర్స్ గూటికి చేరడం జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది.












Click it and Unblock the Notifications