రాజశేఖరరెడ్డినష్టజాతకం!
హోంపేజి టాక్ ఆఫ్ టుడే కాంగ్రెస్ Thursday, March 25 2004
రాష్ట్రకాంగ్రెసు పార్టిలో రాజశేఖరరెడ్డి ప్రాధాన్యంక్రమంగా తగ్గుతున్నది. ఒకప్పుడు రాజశేఖరరెడ్డిఅనుచరుడిగా మసలుకున్న డి .శ్రీనివా ఇప్పుడుస్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.పొత్తుల కోసం ఢిల్లి వెళ్ళినప్పుడు ఇద్దరుఎడమొగం పెడమొహంగా లేకపోయినాఇదివరకటి సాన్నిహిత్యం కన్పించలేదు.
పిసిసిఅధ్యక్ష పదవి లభించినప్పుడు తనకు అదేపెద్ద పదవి అని అంతకు మించిన పదవులమీద ఆశ లేదని ఆయన ప్రకటించారు.కానీ ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యాయి. ఒకవేళకాంగ్రెసు అధికారంలోకి వస్తే శ్రీనివాసు ముఖ్యమంత్రిపదవికి రేసులో ఉండేది ఖాయం. అవకాశమొస్తేరాజకీయాల్లో గురు, శిష్యులన్న పట్టింపుఉండదు.
బిసిఅభ్యర్ధులకు ఎక్కువగా సీట్లు వచ్చేలా శ్రీనివాసుఅధిష్టానవర్గం వద్ద పట్టుబడుతున్నారు.ఉదాహరణకు నిజామాబాదు ఎంపి సీటు. మధుయాష్కి అనే బిసి ఎన్నారె ను శ్రీనివాసు గట్టిగాప్రతిపాదించారు. రాజశేఖరరెడ్డికి ఇది నచ్చకపోయినాఆయన ఏమీ కలగజేసుకోలేదు. బిసికావడం ఒక్కటే శ్రీనివాసుకు అధిష్టానవర్గంవద్ద పెద్ద మార్కు.