చిరు పారితోషికంభారీ!
హోంపేజి టాక్ ఆఫ్ టుడే;/SPAN> జనరల్ 26-07-2005
హైదరాబాద్:భారతదేశంలో అత్యధిక పారితోషికంతీసుకుంటున్న నటుడు చిరంజీవి అని ఎకనామిక్టైమ్స్ పత్రిక ఒక స్పెషల్ ఫీచర్నుప్రచురించింది. పారితోషికం విషయంలో చిరంజీవి షారుఖ్ఖాన్నుఅధిగమించారని ఆపత్రిక కథనం. షారూఖ్ ఫీజు ఐదు కోట్లుకాగా అమితాబ్ నాలుగు కోట్లు పుచ్చుకుంటున్నారు.చిరంజీవి ఏడు కోట్లు తీసుకుంటున్నారని ఆ పత్రికకథనం. నాలుగు దక్షిణాది భాషల్లో మార్కెట్ఉన్నప్పటికీ రజనీకాంత్ నాలుగు కోట్లు మాత్రమేతీసుకుంటున్నారని ఎకనామిక్టైమ్స్ రాసింది. కానీ చంద్రముఖి లో నటించినరజనీ తమిళనాడు వెలుపల ఆ సినిమా వసూళ్ళలో సగంతీసుకుంటున్నట్టుతెలిసింది. ఆ లెక్కన ఆయనకు 15 కోట్లకుపైగానే ముట్టినట్టు తెలుస్తోంది.
తారలరెమ్యూనరేషన్ల విషయం అత్యంతగోప్యంగా ఉంటుంది. అయినప్పటికీ ట్రేడ్వర్గాల సమాచారం ఆధారంగా అంచనాలుదాదాపు దగ్గరగా ఉంటాయి. దక్షిణభారతసినిమా పరిశ్రమ బాలీవుడ్ కంటే పెద్దదని ఎకనామిక్టైమ్స్ రాసింది. ఇది నిజం కాదు. దక్షిణాదిసినిమాలన్నిటినీ ఒక పరిశ్రమగాపరిగణించలేం. తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ పరిశ్రమలువేటికవి ప్రత్యేకంగా ఉన్నాయి.తమిళం, తెలుగులో మాత్రమేకామన్ సినిమాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. చంద్రముఖిఅపరిచితుడు అటువంటివే.చంద్రముఖి సినిమాప్రపంచవ్యాప్తంగా అరవై కోట్లు వసూలు చేసి,బాలీవుడ్ రికార్డును అధిగమించిందని ఆ పత్రిక రాసింది.దక్షిణాదిలో త్రిష అత్యధిక పారితోషికం 70లక్షలు తీసుకుంటోందని రాశారు.
ఇటీవలి కథనాలు హోంపేజి