దాసరికి ఇకమొండిచెయ్యి?
హోంపేజి టాక్ ఆఫ్ టుడే;/SPAN> జనరల్ 21-11-2005
;?
హైదరాబాద్:సొంత సామాజిక వర్గం నుంచేకేంద్ర మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.కాంగ్రెస్ ఎంపీ చేగొండిహరిరామజోగయ్య దాసరి అక్రమాలను, అవినీతిని ఇటీవలబయట పెట్టారు. వాటిపైఅధిష్టానవర్గానికి లేఖ కూడా రాశారు. దాసరి రాజ్యసభ సభ్యత్వంవచ్చే ఏడాదిఫిబ్రవరితో ముగియనుంది. ఆయనకుమళ్ళీ అవకాశం దొరకడంకష్టమేనని భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లోని రెండు కోట్ల మందికాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు తానేఏకైక నాయకుడినని దాసరి అనుకుంటారు. ఆ పద్ధతిలోనే ఆయనకాంగ్రెస్ అధిష్టానవర్గాన్ని మెప్పించిరాజ్యసభ సభ్యత్వం, ఆ తర్వాతకేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు.
మళ్ళీ రాజ్యసభసభ్యత్వం సందేహం కావడంతో దాసరి తెలివిగా హీరోచిరంజీవిని తెర మీదికితెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలజై చిరంజీవ ఆడియో ఫంక్షన్లోఆయన చిరంజీవి వంటి వారురాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు.అందుకు చిరంజీవి సున్నితంగాతిరస్కరించారు. తనకు మంత్రి పదవిపోతే చిరంజీవితో కొత్త పార్టీ పెట్టిస్తాననిబెదిరించడం దాసరి ఉద్దేశమనిహరిరామ జోగయ్య ఆరోపించారు. చంద్రబాబునాయుడు అధికారంలోఉన్నప్పడు ఆ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు ఇలాగే చిరంజీవి పేరునుఉపయోగించుకుని బాగుపడ్డారు.
దాసరి ఇటీవల ఢిల్లీలోదాసరి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికివిందు ఇచ్చారు. తాను త్వరలోదినపత్రిక, టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నట్టుచెప్పారు. తనకుమళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనికోరారు. అందుకు రాజశేఖరరెడ్డితనదైన స్టైల్లో నవ్విఊరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటూ ఒకపత్రిక, ఒక టీవీ ఛానల్ ఉండాలని ఆయనఅన్నట్టు తెలిసింది. అంతే కానీ రాజ్యసభసభ్యత్వం మీద ఆయన ఎటువంటి హామీఇవ్వలేదు.
ఇటీవలి కథనాలు హోంపేజి