మారినవైఎస్ వ్యూహం
హోంపేజి టాక్ ఆఫ్ టుడే కాంగ్రెస్ 18-07-2005
హైదరాబాద్:ఒంటెద్దు పోకడల వల్ల నష్టం జరుగుతుందనిముఖ్యమంత్రి డాక్టర్వైఎస్ రాజశేఖరరెడ్డి అనుభవపూర్వకంగాగ్రహించారు.ఆదివారం తెలంగాణకు చెందినకాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఇచ్చిఆయన రెండు గంటలసేపు వారితోమనసు విప్పి మాట్లాడారు. టిఆర్ఎస్ ధాటిని ఎదుర్కోవాలంటే తెలంగాణ ప్రాంతకాంగ్రెస్ నాయకులను మంచి చేసుకోకతప్పదని ఆయన గ్రహించారు. ఈనెల20న ఢిల్లీలో చంద్రశేఖరరావుతో సమావేశం కానున్న నేపధ్యంలోతెలంగాణ నాయకులను కలుసుకోడానికి ప్రాధాన్యం ఉంది.
అలాగేకాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నపి.జనార్ధనరెడ్డి వంటి నాయకులనుకూడా తన అనుచరుల ద్వారా మంచి చేసుకునే ప్రయత్నాలను వైఎస్ప్రారంభించినట్టు చెబుతున్నారు.పదవులు దొరకని ఎమ్మెల్యేలకు పెద్దపనులు చేసిపెట్టే వారిని సంతోషపరిచే ఫార్ములాతో గతంలో ఎన్.జనార్ధనరెడ్డి, చంద్రబాబు నాయుడుసక్సెస్ అయ్యారు. అదే ఫార్ములానుఅనుసరించమని కోటరీ వైఎస్ సలహా ఇస్తూవస్తోంది. త్వరలో జరుగనున్న మంత్రివర్గవిస్తరణలోసాధ్యమైనంత వరకు అన్నివర్గాలను సంతృప్తి పరచడానికిప్రయత్నించబోతున్నారు.
వైఎస్నువేధిస్తున్న మరో సమస్య మంత్రులవ్యవహారశైలి. రేపు అన్నదిఉండదేమోనన్నంత ఆబగా కొందరుమంత్రులు వ్యవహరించడం,అడ్డగోలుగా జీవోలు జారీ చేయడం ఆయనకుకలవరం కలిగిస్తోంది. మంత్రుల పనితీరును పర్యవేక్షించడానికి ఒకప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేవిషయాన్ని వైఎస్ పరిశీలిస్తున్నారు. చంద్రశేఖరరావుతోసమావేశంఅనంతరం కొన్ని కీలక పరిణామాలుజరుగనున్నాయి. వాటిని దాటినఅనంతరం ఈ చర్యలను వైఎస్తీసుకోనున్నారు. ఈ నాలుగేళ్ళలో కొన్ని నీటిపారుదలప్రాజెక్టులనైనా పూర్తి చేయగలిగితేనేవచ్చే ఎన్నికల్లో మంచిఫలితాలు ఉంటాయని, ఏమీ చేయలేకపోతేదెబ్బతినడం ఖాయమని వైఎస్కుస్పష్టత ఉంది. అధిష్టానవర్గం ఇక నుంచివైఎస్కు తలనొప్పి కానుంది. టిఆర్ఎస్మంత్రుల రాజీనామాలను తానుగవర్నర్కు పంపినా ఆయన ఒకరోజుఆలస్యం చేయడం వెనుకఅధిష్టానవర్గం ఒత్తిడి ఉందని భావిస్తున్నారు. ఇదేధోరణి కొనసాగితేఇకపై వైఎస్ తీసుకునే ప్రతి ప్రధాన చర్య మీద అధిష్టానవర్గంచెక్ఉంటుందని అనుకోవాలి. త్వరలోజరుగనున్న మంత్రి వర్గ విస్తరణలోకూడా ఆయన అధిష్టానవర్గం మాటవినాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
ఇటీవలి కథనాలు హోంపేజి