బాబు కౌంటర్ ప్లాన్
పోలీసువేధింపులు, తెలుగుదేశం ప్రభుత్వకక్ష సాధింపు ధోరణికి నిరసనగానిరాహార దీక్ష చేస్తున్న రంగాను తెల్లవారుజామునఆ శిబిరంలోనే హత్య చేశారు. అప్పటికిఆరేళ్ళుగా అధికారంలో ఉన్న తెలుగుదేశంప్రభుత్వం మీద ప్రజల్లో అంతర్లీనంగాఉన్న వ్యతిరేకత రంగా హత్యతోకన్సాలిడేట్ అయింది. రంగా హత్యానంతరంకొన్ని కోస్తా జిల్లాల్లో ఒక కులం వారిపై ఇతరకులాల వారు దాడులు చేశారు. తెలుగుదేశంపార్టీని ఎన్టీఆర్ కూడా కాపాడలేరన్న సంకేతాలుఅప్పటికే కన్పించసాగాయి.
పరిటాలరవి హత్యతో ఆనాడు జరిగినట్టే రాజకీయపరిణామాలు ఉంటాయా? రవి హత్య ఎన్నికలముందు జరిగితే ప్రభుత్వ వ్యతిరేకతక న్సాలిడేట్ అవుతుండవచ్చు. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడాకాలేదు కాబట్టి ఇప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకతఅనే భావనకు తావు ఉండదు. రవి హత్యతోతెలుగుదేశం పార్టీ వారిలో బ్రహ్మాండమైనఐక్యత వచ్చింది. అధికార పార్టీ మీదఉద్యమ రూపంలో పోరాడాలన్న పట్టుదలటిడిపి నాయకుల్లో కేడర్లొ కన్పిస్తోంది.
రవినడిపిన రాజకీయాలు, ఫ్యాక్షన్ కార్యకలాపాలురంగాకు కొంత భిన్నమైనవి. ఇద్దరి పంథాలోనూఒకే ఒక సారూప్యత ఉంది. కృష్ణాజిల్లాలో ఆధిపత్యంవహిస్తున్న కమ్మ వారికి వ్యతిరేకంగాఇతర కులాలను రంగా కలుపుకొస్తే,అనంతపురం జిల్లాలో రెడ్డి దొరలఆగడాలను ఎజెండాగా చేసుకుని బిసి, ముస్లింవర్గాలను రవి సమైక్యం చేయగలిగారు.ఇదొక్కటే వారిద్దరి మధ్య సారూప్యత.రవివి ప్రగతి శీల భావాలు. రంగా లంపెన్వర్గాల ప్రతినిధి. అప్పుడూ ఇప్పుడూ పోలీసులుప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించారన్నదిబహిరంగ రహస్యం.
రంగాహత్య జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిఎన్టీఆర్ రాజీనామా చేశారా అని రాష్ట్ర మంత్రిబొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యనుమరణించిన సమయంలో రంగాకు భార్యగాఉన్న రత్నకుమారి విమర్శించారు. రంగానుహత్య చేసిన వారిని పార్టీలోకిచేర్చుకున్న కాంగ్రెస్కు రంగా పేరుఉచ్ఛరించే అర్హత లేదని ఆమె మంగళవారంవ్యాఖ్యానించారు.