2011 ప్రపంచకప్ పై ప్రభావం!

లాహోర్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని భారత విదేశాంగ సహాయమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ఆ ఘటన పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో భారత క్రికెట్ జట్టును పాకిస్థాన్ పంపించలేదని ఆయన తెలిపారు. పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఏస్థాయిలో పేరుకుపోయారో ఈ సంఘటన తెలపుతుందని ఆయన అన్నారు. పాక్ ప్రభుత్వం మేల్కోని ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని ఆనంద్శర్మ సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications