Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాటలు కరువైన మాంత్రికుడు!

K Chandrasekhar Rao
హైదరాబాద్: "తెలంగాణ వచ్చుడో, కెసీఅర్ సచ్చుడో తేలాలి" అని చాలా ఏళ్ళుగా టీఅర్ ఎస్ అధినేత చంద్రశేఖరరావు చెబుతూ వచ్చారు. "తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే కుష్టు రోగినైనా కౌగలించుకుంటాం" అని మొన్నటి ఎన్నికల ముందు అన్నారు. ఆయన మాటల మాంత్రికుడు. తెలంగాణ మాండలికాన్ని ఆయన చాలా బాగా ఉపయోగించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను వెన్న చిలికినట్టు ఆయన చిలకగలిగారు. గతంలో యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకాన్ని ఆయన జనంలో కలిగించారు. చివరికి వారితో తెగతెంపులు చేసుకుని మహాకూటమిలో కలిసిపోయి, ఆ తర్వాత తటస్ధమైపోయి ఆయన సర్వ భ్రష్టమైపోయిన మాట వాస్తవం. "చంద్రశేఖరరావు పొయ్యి పెడతాడు. బియ్యం గిన్నె పెడతాడు. అన్నం పూరిగా ఉడికే వరకు ఆయన ఆగలేడు" అని ఆయన గురించి కొన్ని దశాబ్దాలుగా తెలిసిన ఒక పెద్దాయన ఐదేళ్ళ క్రితం ఒక పత్రికతో అన్నారు. ఆ మాటలు ఇప్పుడు నిజంలాగానే కనిపిస్తున్నాయి.

టీఅర్ ఎస్ బలహీనపడింది కానీ తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉందన్న వాదన ఉంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన పరిణామాలు, ఆ పార్టీలో తిరుగుబాట్లు నిజమైన తెలంగాణ వాదులను కలవరపరుస్తున్నాయి. కెసీఅర్ వల్ల కాకపోతే మరో నాయకుడి ద్వారా అయినా తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న ఆశలకు కామా పడే విధంగా ఇప్పటి పరిణామాలు సాగుతున్నాయి. కెసీఆర్ ఒక నియంతలాగా, దొరలాగా వ్యవహరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. టీఅర్ ఎస్ లో కెసీఅర్ కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిందన్న విమర్శ మరొకటి. టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణ మరొకటి.

"రెడ్లకు ఒక తెలంగాణ, ఎస్ సిలకు ఒక తెలంగాణ, వెలమలకు ఒక తెలంగాణ, ఎస్ టిలకు ఒక తెలంగాణ, బీసీలకు ఒక తెలంగాణ- ఇన్ని తెలంగాణలు అవసరమా?" అని ఒక తెలంగాణ మేధావి గతంలో ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దళిత అభ్యర్ధే ఉంటారని ఐదేళ్ళ క్రితం కెసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆ తరహా ప్రకటనలు మానేశారు. పార్టీలో కుటుంబసభ్యుల పెత్తనం పెరిగింది. ఒక్క విషయం మాత్రం వాస్తవం. ఆయన మాటల మాత్రికుడే కాదు, రాజకీయంగా చాణక్యుడు. కాకపోతే ఆయన పావులు కావలసింతకన్నా నాలుగు రెట్లు వేగంగా కదులుతుంటాయి. ఎన్నికల ఫలితాలు రాకముందే ఎన్డేయేకు మద్దతు ఇస్తామని ప్రకటించడం అటువంటిదే. అక్కడే తేడా జరుగుతోంది. కెసీఅర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేదన్న అభిప్రాయం ఉంది.

రవీంద్ర నాయక్ తదితర రెబల్స్ కెసీఆర్ ను పెద్దగా ఇబ్బంది పెట్టలేరు. టీఅర్ ఎస్ లో తిరుగుబాట్లు టీవీ చానల్స్ కు పండుగలా ఉండవచ్చు కానీ కెసీఅర్ కు "ముందున్నది ముసళ్ళ పండగ" అని చెప్పలేం. ఎంపీగా అయినా ఆయన తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని ఐదేళ్ళు గడిపేయగలడు. ఈలోపు అక్కడక్కడ మాటలతో గడబిడ చేయగలడు. పాత వ్యూహాలు ఫలించలేదు కాబట్టి కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్దామని నేటి టీఅర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆయన చెప్పారు. స్ధిరంగా ఉండకుండా వ్యూహాలు మార్చుకోవడం రాజనీతిలో భాగమని, ఆయన చెప్పడం, విజయశాంతి వంటి కొత్త వారు చప్పట్లు చరచడం అయిపోయాయి. వచ్చేవారం మళ్ళీ జరగనున్న టీఅర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో మరిన్ని విశేషాలు ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+