వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం రాష్ట్రపతి పాలన అస్త్రం!

By Santaram
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రపతి పాలన ఆంధ్రకు అనుకూలమా? తెలంగాణకు అనుకూలమా? అన్నది ఇప్పుడు అప్రస్తుతం. సోమవారం నుంచి రాష్ట్రపతిపాలన విధించనున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అందుకే అత్యంత వృద్ధ గవర్నర్ ఎన్ డి తివారీని మార్చి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీని నియమించాలని సోనియాగాంధీ యోచిస్తున్నట్టు సమాచారం.

సోనియాగాంధీకి ఆంధ్ర మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద వాత్సల్యం లేదు. ఆమెకు, ఆమె చుట్టూ ఉన్న అనుచర గణానికి తెలుగు ఓటర్ల అభిమానం కావాలి. రాష్ట్రం రెండుగా విడిపోయినా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్న నమ్మకం కలిగిన తర్వాతే మరో నిర్ణయం తీసుకునే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, టిఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న సంకేతాన్ని కెసిఆర్ కేంద్రానికి పంపించారు. అయినా దీని మీద తర్జన భర్జనలు ఇంకా జరుగుతున్నాయి.

ఇప్పుడు తెలంగాణ వాదుల చూపు కేంద్ర కేబినెట్ మంత్రి జైపాల్ రెడ్డి మీద ఉంది. కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణకు అనుకూలంగా 9న తొలి ప్రకటన చేసినప్పుడు జైపాల్ చాలా ఆనందం వ్యక్తం చేశారు. తన మనసులో ఉన్నా ఎప్పుడూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడని జైపాల్ ఇలా బయటపడి ఇరుక్కున్నారు. ఇప్పుడు తెలంగాణ వాదులు జైపాల్ మీద విచిత్రమైన వత్తిడి తెస్తున్నారు. కేంద్ర కేబినెట్ లోనే ఉండి తెలంగాణ కోసం ఆయన సమరం చేయాలన్నది వారి ఉద్దేశం.

రాష్ట్రపతి పాలన విధిస్తే గవర్నర్ కు, ఆయన సలహాదారులకు, చీఫ్ సెక్రటరీకి పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి. ఆరునెలల పాటు అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచవచ్చు. ఈలోపు పరిస్ధితులు శాంతిస్తే తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X