జగన్ పై రామోజీ ప్రతీకారం

ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో అచ్చయిన వార్తాకథనాలకు సమాధానం ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామోజీరావుపై, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి తోడు, జగన్ తో తనకు వ్యాపార సంబంధాలు లేవని కూడా చెప్పారు. దాన్ని ఆసరాగా తీసుకుని ఈనాడు దినపత్రిక సోమవారం ఈ సంబంధాలను బయటపెట్టే వార్తాకథనాన్ని పతాక శీర్షిక కింద అచ్చేశారు. ఓబుళాపురం మైనింగ్ లో 50 శాతం వాటా పొందుతున్న ఆర్ఆర్ గోల్డ్, రెడ్ గోల్డ్, జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ కార్యాలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయని, జగన్ కు గాలి జనార్దన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఈ వార్తాకథనం సారాంశం.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నిరంతరం ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల యాజమాన్యాలపై నిరంతరం విమర్సలు చేస్తూ వచ్చారు. దానికితోడు, రామోజీ ఆధిపత్యంలోని మార్గదర్శి పైనాన్స్ కంపెనీ అక్రమాలకు పాల్పడుతోందంటూ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్ని రకాలుగా దాడి చేస్తూ వచ్చారు. దానికితోడు, ఈనాడుకు పోటీగా వైయస్సార్ తనయుడు వైయస్ జగన్ సాక్షి దినపత్రికను స్థాపించారు. ఈ స్థితిలో రామోజీరావు ఆత్మరక్షణ చేసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని అంటున్నారు. వైయస్సార్ మృతి చెందడం, ఉండవల్లి మౌనం దాల్చడం, జగన్ కు కాంగ్రెసు అధిష్టానం పూర్తి మద్దతు ప్రకటించకపోవడం వంటి కారణాల వల్ల రామోజీరావు జగన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. చంద్రబాబు సిపిఐ, సిపిఎం, లోకసత్తా నాయకులను కలుపుకుని ఉద్యమం చేపట్టడం ద్వారా జగన్ పై ముప్పేట దాడి సాగించాలనేది రామోజీ వ్యూహంగా కనిపిస్తోంది.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications