జగన్ శక్తియుక్తులు

జగన్ భారీ యెత్తున సాక్షి దినపత్రికను, టీవీ చానెల్ ను ప్రారంభించి నడిపిస్తున్నారు. వేలాది రూపాయల జీతాలతో ఉద్యోగులను నియమించుకున్నారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులు ఆయన చేపట్టారు. పలు ప్రాజెక్టుల్లో ఆయన భాగస్వామిగా ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రస్తుత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల పెట్టుబడులు జగన్ సంస్థల్లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తానొక్కడే కాకుండా వైయస్ లాభసాటిగా చేసినట్లు ప్రచారం ఉంది. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి వారితో జగన్ వ్యాపార భాగస్వామి అంటారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్ ల) పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రంలో పెద్ద యెత్తున సాగింది. గత ఐదేళ్లలో దానికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీంట్లో ఎక్కువగా లాభపడింది వైయస్ లాబీలోని జగన్ వర్గీయులేననే విమర్సలు కూడా ఉన్నాయి. ఈ లాబీ అంతా ఇప్పుడు ఒక్కటై జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే పట్టుదలతో ఉంది.
జగన్ కు సంబంధించి మరో అంశం కూడా కలిసి వస్తోంది. రాష్ట్రంలోని రెడ్లంతా కలిసికట్టుగా జగన్ నాయకత్వం కావాలంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పని చేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వంటి వారు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అంటున్నారు. తెలుగుదేశంలోని మైసురా రెడ్డి వంటివారు కూడా జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు చెప్పవచ్చు. దీనికి రాజకీయ కారణం ఉంది. జగన్ ను ముఖ్యమంత్రిని చేసి తమ ప్రాబల్యం తగ్గకుండా, తమ లావాదేవీల్లో తేడా రాకుండా చూసుకోవాలని వైయస్ వర్గీయులు భావిస్తుండగా ఈ లాబీ మాత్రం తెలంగాణ బిసిలకు ముఖ్యమంత్రి పదవి పోతుందేమోననే భయంతో ఉంది. నిశితంగా గమనిస్తే, తెలంగాణకు చెందిన వి హనుమంతరావు, డి. శ్రీనివాస్ వంటి సీనియర్ బిసి నేతలు జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. జగన్ ఉప ముఖ్యమంత్రి పదవికి అంగీకరిస్తే పెద్ద మనుషుల ఒప్పందం మేరకు తెలంగాణ నాయకుడిని ముఖ్యమంత్రిని చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా రెడ్లే ఉండడం సాధ్యం కాదు కాబట్టి ముఖ్యమంత్రి పదవి తెలంగాణ బిసి నాయుకుడికి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆశతోనే భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జగన్ కు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే శాసనసభ్యురాలు కొండా సురేఖ జగన్ లాబీకి దూరం జరిగినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణ రెడ్లు జగన్ నాయకత్వాన్ని కోరుకుంటుండగా, తెలంగాణ నేతను ముఖ్యమంత్రిగా అంగీకరించడం ఇష్టం లేక తెలంగాణేతర నాయకులు జగన్ ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు.
జగన్ శక్తియుక్తులన్నీ ఇవే. అయితే, కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం ఆలోచన మాత్రం జగన్ పట్ల వ్యతిరేకత చూపడానికి ఇతర కారణాలున్నాయి. జగన్ ఒత్తిడికి లొంగకూడదనేదే ఆ వ్యతిరేకతకు కారణం. ఈ స్థితిలో జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో కెవిపి రామచంద్ర రావు చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications