వైయస్ జగన్ పై అస్మదీయుల వత్తిడి!
రేపు వీరప్ప మొయిలీ గ్రేటర్ ఎన్నికల వ్యూహం ఖరారు చేయడానికి హైదరాబాద్ వస్తున్నారు. జగన్ మాత్రం తండ్రి పోయిన విషాదంలో అలా మిగిలిపోయి ఉన్నారు. ఇంకా ఆయన మెత్తగానే ఉన్నారు. ఆయనను కదిలించి, నగారా మోగించాలని వైయస్ వర్గానికి చెందిన హార్డ్ కోర్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. జగన్ ను ఎమోషనల్ అరెచ్చగొడుతున్నారు.
వీరప్ప మొయిలీ ఇటు ఉన్నారా? అటు ఉన్నారా? ఎటూ లేరా అన్నది తేలడానికి చాలా సమయం పట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జులుగా జగన్నాధ్ పహాడియా నుంచి వీరప్ప మొయిలీ వరకు కనీసం పది మంది వ్యవహరించారు. వీరిలో చాలా మంది ఈ రాష్ట్రం నుంచి, ఈ పదవి నుంచి ఏమి వస్తుందని ఆశించిన వారే.
జగన్ వర్గంలో మాత్రం ఓవరాక్షన్ కు ఏమాత్రం తక్కువ లేదు. ఎమ్మెల్యేలే కాకుండా సాక్షాత్తు సాక్షి కూడా జగన్ కోసం వీరంగం వేస్తోంది. ఎమ్మెల్యేల వెర్షన్ చూడండి: ఆదినారాయణరెడ్డి, తదితర ఎమ్మెల్యే లు ఈ సందర్భంగా ఆవేశంగా మాట్లాడినట్లు సమా చారం. '2004లో మీ నాయన ఎంతో కష్టపడి, ప్రాణాలను పణంగా పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పుడు ఆయనకు తగినంత మంది మద్దతు లేకున్నా ఎంతో రిస్కు తీసుకు న్నారు. ఇప్పుడు నీకు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మద్దతిస్తు న్నారు. అయినా ఎందుకు వెనుకంజ వేస్తున్నామో అర్ధం కావడంలేదు. ఇలాగే ఉంటే మనల్ని పూర్తిగా అణచివేస్తున్నారు. ఇప్పుడు పీఆర్పీని చూపెట్టి భయపెడుతున్నారు. రేపు ఇంకోటి చూపెట్టి భయపెడతారు. హైకమాండ్ ఆలోచన స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా ఎంతకాలం సహిస్తాం" అని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఆయనతో అక్కడున్న వారంతా ఏకీభవించారు.