వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు వ్యతిరేకంగా రంగంలోకి 'దేశ ముదుర్లు'

By Santaram
|
Google Oneindia TeluguNews

Keshav Rao
హైదరాబాద్: రోశయ్యకు మద్దతుగా, జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెసు సీనియర్లు రంగంలోకి దిగనున్నారా? జగన్ సభలకు కాపులు ఎక్కువగా హాజరవుతున్నట్టు ఢిల్లీకి సమాచారం వెళ్ళింది. వచ్చే వారం నుంచి కే కేశవరావు, బొత్స సత్యనారాయణ, వి హనుమంతరావు వంటి నాయకులతో ఉభయ గోదావరి జిల్లాల్లో సభలు పెట్టించాలని కాంగ్రెసు హై కమాండ్ యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నది ఓసీ కాపులు. వాళ్ళు రాజులతో సమానంగా వ్యవసాయంలో తరతరాలుగా ఉన్న వాళ్ళు. ఇతర గ్రామీణులను ప్రభావితం చేసే శక్తి వారికుంది.

కాంగ్రెసు హై కమాండ్ దింపుతున్న కేశవరావు, హనుమంతరావు తెలంగాణకు చెందిన మున్నూరు కాపులు. వీళ్ళు బీసీలు. వీళ్ళు హైదరాబాద్ ముదుర్లు కారు. ఢిల్లీ లాబీయింగ్ ద్వారా 'దేశముదుళ్ళు" అయ్యారు. బొత్స సత్యనారాయణ కూడా బీసీ కాపే. వీళ్ళకు ఉభయగోదావరి జిల్లాలో ఫాలోయింగ్ ఏమాత్రం లేదు. సోనియాగాంధీకి, ఇతర హై కమాండ్ నేతలకు రాష్ట్రంలో సామాజిక వర్గాలు, కులాలపైన అవగాహన లేదనడానికి ఇది చక్కటి ఉదాహరణ. కేశవరావు, హనుమంతరావులు ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడితే వార్డు మెంబర్లుగా కూడా గెలిచే అవకాశముండదు. అధినేత్రిని కాకాపట్టుకుని వాళ్ళు కాలం వెళ్ళదీసుకుంటున్నారు. ఒక్క బొత్స సత్యనారాయణకు మాత్రం ఉత్తరాంధ్రలో పలుకుబడి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అతని పప్పులు ఉడకవు.

ముఖ్యమంత్రి రోశయ్యకు మాత్రం ఈ కులాల వ్యవహారం బాగా తెలుసు. కానీ ఆయన ఇప్పుడు హైకమాండ్ ముందు నోరెత్తే పరిస్ధితి లేదు. అమ్మగారు చెప్పినట్టు చేసుకుంటూ పోవడమే ఆయన పని. జగన్ జగమొండిగా మారడంతో ఆ భయానికి రోశయ్య పూర్తిగా హైకమాండ్ ముందు దాసోహమంటున్నారు. జగన్ కోసం తూర్పు గోదావరి జిల్లాలో జన సమీకరణ బాగా జరిగింది. ధనబలం, వైఎస్ పై అభిమానమున్న మండల స్ధాయి నాయకుల వల్ల ఇది సాధ్యమైంది. జగన్ అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా పర్యటించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X