కెసిఆర్ పత్రిక ఆంధ్రావాళ్లకేనా?

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక పూర్తిగా తెలంగాణ పాఠకుల కోసమే కాదట, ఆంధ్ర ప్రజల కోసం కూడానట. ఈ మాట అంటున్నది ఎవరో కాదు, కెసిఆరే. ఆంధ్ర ప్రజలు కూడా చదివే విధంగా పత్రికను రూపుదిద్దుతామని కెసిఆర్ అంటున్నారు. ఇప్పటికే రాజ్ న్యూస్ టీవీ చానెల్ ద్వారా హల్ చల్ చేస్తున్న కెసిఆర్ నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా మరో మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఆంధ్ర టీవీ చానెళ్లు ఇచ్చే వార్తలకు, వార్తాకథనాలకూ రాజ్ న్యూస్ ఇచ్చే వార్తలకు, వార్తాకథనాలకు మధ్య ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. రాజ్ న్యూస్ లో వస్తున్న వార్తలు, వార్తాకథనాలు చాలా వరకు సీమాంధ్ర యాజమాన్యంలోని ఇతర టీవీ చానెళ్లలో కనిపించడం లేదు. నమస్తే తెలంగాణ పత్రిక పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. రాజ్ న్యూస్ కెసిఆర్, ఆయన కూతురు కవిత వార్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. బతుకమ్మ జాతరను ఓ ఉద్యమంలా ప్రసారం చేసింది.

నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణ ప్రజల మైండ్ సెట్ ను మాత్రమే కాకుండా ఆంధ్ర ప్రజల మైండ్ సెట్ ను కూడా మారుస్తుందని కెసిఆర్ అంటున్నారు. తమ పత్రికకు తెలంగాణ ప్రజలు సేల్స్ ప్రమోటర్స్ గా వ్యవహరించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఈ పత్రిక చదవాలని తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను, ముఖ్యంగా హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలను కోరాలని ఆయన సూచించారు. నమస్తే తెలంగాణ పత్రిక డిసెంబర్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో నమస్తే తెంలగాణ పత్రిక కార్యాలయం నిర్మాణానికి కెసిఆర్ దసరా రోజు భూమి పూజ చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పత్రిక కోసం భూమి పూజలు జరిగాయి.

నమస్తే తెలంగాణ పత్రికకు ఇప్పటికే చంద్రశేఖర రావు సిబ్బందిని కూడా సమకూర్చుకున్నారు. వారు రంగంలోకి దిగారు. నవంబర్ నుంచి పత్రిక పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం పత్రిక కోసం తీసుకున్న పైస్థాయి సిబ్బంది తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+