Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్ తలించిందొకటి, జరిగేది..

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పీకల లోతు కష్టాల్లో పడబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ ఒకటి తలిస్తే ఆయన ప్రత్యర్థులు మరోటి తలుస్తున్నారని అంటున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భూకంపం పుట్టిస్తానని పదే పదే చెబుతున్న కెసిఆర్ కు ఆటంకాలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారు. కెసిఆర్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ సీమాంధ్రులకు, కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. డిసెంబర్ తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే సహాయ నిరాకరణ చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభించజేస్తామని అంటున్నారు. ఇలా ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలోనే అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆయనకు ఇవి మింగుడు పడే విషయాలు కావు.

ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ను ఏర్పాటు చేయడం కెసిఆర్ కు పెద్ద తలనొప్పిగా తయారేంది. తానే కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని భావించిన కెసిఆర్ కు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ అంతా తన వెంట ఉంటుందన్న ఆయన విశ్వాసంపై వేటు పడింది. తన ఫ్రంట్ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, గ్రామస్థాయి నుంచి ఫ్రంట్ ను బలోపేతం చేస్తామని గద్దర్ అంటున్నారు. ఇది కచ్చితంగా తెరాసకు నష్టం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా, గద్దర్ కు మీడియా సహకారం దండిగా లభిస్తోంది. తమ ఆధిపత్యంలోని మీడియాను ప్రశ్నించడానికి ఒడిగట్టిన కెసిఆర్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సీమాంధ్ర మీడియాకు గద్దర్ ప్రజా ఫ్రంట్ మంచి అవకాశాన్నే కలిగించిందని చెప్పాలి. ఇప్పటికే కెసిఆర్ కు వ్యతిరేకంగా గద్దర్ ను చూపిస్తూ మీడియా వార్తకథనాలను పండిస్తోంది.

ఇదిలా ఉంటే, తెరాసపై తెలంగాణ అమరవీరుల కుటుంబాలు తిరుగుబాటుకు పూనుకున్నాయి. తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ ముందు తెలంగాణ అమరవీరుల కుటుంబాలవారు ధర్నాకు దిగారు. తెరాస ఇచ్చిన చెక్కులు చెల్లలేదంటూ వారు ఆందోళనకు దిగారు. తమను తెరాస పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం కూడా వారు ధర్నాకు దిగారు. తెలంగాణ కోసం మరణించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తెరాస నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తెరాస కొంత మేరకు ఆత్మరక్షణలో పడినట్లే. తెరాస నాయకుడు సుమన్ తెలంగాణ అమర వీరుల ఐక్య వేదిక నాయకుడు రఘుమారెడ్డిపై చేయి చేసుకోవడం సమస్యలో మరో సమస్యగా ముందుకు వచ్చింది. డిసెంబర్ తర్వాత భూకంపం పుట్టించాలనే కెసిఆర్ ప్రయత్నాలకు గండి కొట్టే చర్యలు వ్యతిరేక శక్తులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+