జగన్ ముందస్తు జాగ్రత్త

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ ఆస్తులు పెద్ద యెత్తున పెరిగాయనేది లోకానికి తెలుసు. కోట్లాది రూపాయలకు జగన్ పడగలెత్తాడు. మీడియాను, మీడియా ద్వారా రాజకీయ, పారిశ్రామిక రంగాలను శాసించడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే జగతి పబ్లికేషన్ సంస్థ ద్వారా సాక్షి దినపత్రికను వెలువరిస్తున్నారు. టీవీ చానెల్ వస్తోంది. తనపై వచ్చే, వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికే ఈ రెండు సంస్థలను జగన్ వాడుకుంటున్నారు. అయితే, ఇంతకు ముందు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ఆదాయం పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలపై ఓ కన్నేసి ఉంచింది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆ చర్యలు ప్రారంభమయ్యాయి.
అధిష్టానంతో పోరాటం చేయడానికే సిద్ధపడిన జగన్ ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ఆదాయం పన్నును అంత పెద్ద మొత్తంలో చెల్లించారనే మాట వినిపిస్తోంది. చేతికి మట్టి అంటకుండా జగన్ తన సంస్థల్లోకి వైయస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టుబడులను రాబట్టుకున్నారని అంటారు. అంతేకాకుండా, భారతి సిమెంట్స్ నుంచి ఎమ్మార్ ప్రాపర్టీస్ దాకా పలు రూపాల్లో వైయస్సార్ వర్గానికి చిక్కిన కోట్లాది రూపాయల ఆస్తుల్లో వైయస్ జగన్ కు దక్కింది చాలా ఉందనే ఆరోపణలున్నాయి. అయితే, ఆయన న్యాయబద్దంగా ఉండేలా లొసుగులను సవరించి క్లీన్ గా ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు వినికిడి.












Click it and Unblock the Notifications