జగన్ ఎమ్మెల్యేలకు బొత్స గాలం?

బొత్స నియామకం సిఎంకి ఇష్టం లేనప్పటికీ అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి అన్నింటిలో విఫలం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో బొత్స సత్యనారాయణ కేంద్ర బిందువు కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్నప్పడు పిసిసి అధ్యక్షుడికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కాకుండా బొత్స ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉందని ఉందని పార్టీలో వాదనలు వినిపిస్తున్నాయి. సిఎం కంటే బొత్సకు ప్రాధాన్యత పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే పరిణామాల దృష్ట్యా పలువురు బొత్స బాధ్యతలు చేపట్టక ముందే ఆయనను కలిసి అభినందనలు తెలుపుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఆయనకు బద్ద వ్యతిరేకి అయిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్సను కలిశారు. అంతేకాదు వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులుగా భావిస్తున్న రేగా కాంతారావు, జోగి రమేష్ కూడా బొత్సను కలిశారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్న వారు, బొత్స నియామకం వల్ల పార్టీ గాడిన పడుతుందని భావిస్తున్న జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బొత్సకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications