చిరంజీవి ఏడాది ఆగాల్సిందేనా?

రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చేత రాజీనామా చేయించాలని, అందుకు ప్రతిగా జనార్దన్ రెడ్డిని ఏదైనా రాష్ట్రానికి గవర్నరుగా పంపించాలని, అలా ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు చిరంజీవిని ఎంపిక చేసి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అందుకు అంగీకరించకపోతే, చిరంజీవి కోరిక నెరవేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంగీకరించకపోతే చిరంజీవిని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోకి తీసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో ఏర్పడే సమన్వయ కమిటీలో స్థానం కల్పించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు చిరంజీవి సుముఖంగా లేరని చెబుతున్నారు.
ఇదంతా రెండు మూడు వారాల తర్వాత కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం అధికారికంగా పూర్తయిన తర్వాతనే చర్చకు వస్తుందని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన ముగ్గురు శానససభ్యులకు మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి కోరుతున్నారు. అధిష్టానం ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి మాత్రమే ఇష్టపడుతోంది. ఏమైనా, ఈ విషయాలపై స్పష్టత రావడానికి మూడు వారాలైనా పట్టవచ్చు.












Click it and Unblock the Notifications