సిబిఐ దర్యాఫ్తు: బాబు, జగన్ తీరులో వైరుధ్యం!

అదే సమయంలో టిడిపి మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ పైన తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. తెలుగుదేశం విజయమ్మ పిటిషన్పై కోర్టుల చుట్టూ తిరుగుతూనే మరోవైపు ఆమె పిటిషన్లో తాము అవాస్తవాలు అని భావించిన వాటిని ప్రజల ఎదుట ఎత్తి చూపిస్తున్నారు. తమ నేత అధికారంలో ఉండగా ఎప్పుడూ తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి నుండి నేడు దూళిపాళ్ల నరేంద్ర వరకు విజయమ్మ పిల్లోని పలు అంశాలను తప్పు పడుతూ అవి బాబు హయాంలో జరగలేదని కాంగ్రెసు, వైయస్ హయాంలోనే జరిగాయని ఎదురు దాడికి దిగుతున్నారు. విజయమ్మ పిల్ పైన టిడిపి ఎదురుదాడి చేయడానికి ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోయినట్లుగా కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే తమ తమ అధినేతల ఆస్తుల కేసుపై ఇరు పార్టీల నేతలు పరస్పర విరుద్ధంగా స్పందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం వారి వాదనలు ఒకేరకంగా ఉన్నాయి. జగన్ ఆస్తులపై కేసు పెట్టినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు నేతలు టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కైందని, సిబిఐ కాంగ్రెసు తొత్తు అని విమర్శించాయి. ఇప్పుడు బాబు ఆస్తులపై కేసు పెట్టాక టిడిపి నేతలు జగన్, కాంగ్రెసు కుమ్మక్కై తమ అధినేతపై కేసు పెట్టారని, సిబిఐ అంటే కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని అంటున్నారు.












Click it and Unblock the Notifications