నెట్వర్క్ 18లో రామోజీ ఈటీవి విలీనం?

ఈనాడు, నెట్వర్క్ 18 మధ్య విలీన చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే ఓ ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయంటూ ఆంగ్ల పత్రిక రాసింది. దీనికి సంబంధించి తాము ఇ- మెయిల్ ద్వారా ప్రశ్నలు పంపిస్తే రామోజీరావు కుమారుడు సిహెచ్ కిరణ్ నుంచి తమకు ఏ విధమైన సమాధానాలు రాలేదని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. తమ ఇ - మెయిల్స్కు నెట్వర్క్ 18 అధికార ప్రతినిధులు కూడా స్పందించలేదని చెప్పింది. నెట్వర్క్ 18, ఈటివీ విలీన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ు చెందిన ముఖేష్ అంబానీ వాటా పొందవచ్చునని కూడా ఆ పత్రిక రాసింది.
దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమంలో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర - మధ్య భారతదేశంలో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తూర్పున పశ్చిమ బెంగాల్, ఒడిషాల్లో ఈటీవి తన ఉనికిని చాటుతోంది. ఒక రకంగా దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో అది తన ప్రభావాన్ని చూపుతోంది. అమెరికాలోని ఇండియా డయాస్పోరాకు కూడా అందుబాటులో ఉంది. నెట్వర్క్ 18 కూడా తన ఉనికిని రెండు సంస్థల ద్వారా చాటుతోంది. దానికి నాలుగు జాతీయ చానెళ్లు - సిఎన్బిసి - టీవీ 18, సిఎన్బిసి ఆవాజ్, ఐబిఎన్7, సిఎన్ఎన్- ఐబియన్ ఉన్నాయి. మరికొన్ని చానెళ్లలో వాటాలున్నాయి. నెట్వర్క్ 18, ఈటీవీ కలిస్తే దేశంలో అతి ప్రధానమైన మీడియా వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications