Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్షోభం వెనుక వైయస్ జగన్?

YS Jagan
ప్రస్తుత తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల సంక్షోభం వెనుక వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పరోక్ష హస్తం ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే లక్ష్యంతోనే వైయస్ జగన్ ఉన్నాడనే విషయం గత కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సైతం తన ఓదార్పుయాత్రలో, చేపట్టిన పలు దీక్షలలో ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా తనకు ఉందని ముందు చెప్పినప్పటికీ ఆ తర్వాత తనకు ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా లేనందునే పడగొట్టడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పడగొట్టే సత్తా ఉన్నప్పటికీ పడగొట్టడం లేదని ఆరోపణలు చేశారు. జగన్ ప్రతి మాటలో ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా చేసుకున్నాడనే వాదనలు వినిపించాయి. అవిశ్వాస తీర్మానంతో గానీ, ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడం వల్ల కానీ విధానసభా పరంగా, చట్టపరంగా తాను ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి కనిపించనందున జగన్ ఇక పరోక్షంగా ఆ పనికి పూనుకున్నాడని పలువురు భావిస్తున్నారు.

టి-కాంగ్రెసు సంక్షోభం వెనుక జగన్ కనిపించనప్పటికీ ఆయన హస్తం ఉందని భావించే వారున్నారు. విధానసభ పరంగా తాను ప్రభుత్వాన్ని పడగొట్టలేక పోయినప్పటికీ టి-కాంగ్రెసును రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే స్కెచ్ జగన్ వేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం జూలై 1లోపు తేల్చకుంటే రాజీనామా చేస్తామన్న టి-కాంగ్రెసు హెచ్చరికల నేపథ్యంలో వారి హెచ్చరికలతో జగన్ పొలిటికల్ గేమ్ అడినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 1న సమావేశమైన టి-కాంగ్రెసు సమావేశంలో పలువురు జగన్ వర్గ తెలంగాణ కాంగ్రెసు నేతలు రాజీనామాకు పట్టుబట్టినట్లుగా సమాచారం. అంతకుముందు వరకు టి-కాంగ్రెసు మొదట అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చి ఆ తర్వాత రాజీనామాలు చేయాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సమావేశంలో జగన్ వర్గం రాజీనామాలకు పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది.

సమావేశం జరుగుతుండగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలు రావడం, వారితే రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు వేరుగా చర్చలు జరపడం, వెంటనే రాజీనామాల నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయంట. మరో రెండు మూడు రోజుల్లో ఇడుపులపాయలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ మొదటి ప్లీనరీ ఉంది. ఈ ప్లీనరీలోగా రాష్ట్రంలో సంక్షోభం సృష్టించి ఎన్నికలు వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశ్యంతో జగన్ తన వైపు ఉన్న టి-కాంగ్రెసుతో చాతుర్యం ప్రదర్శించాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్లీనరీలో జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా తీసుకోక పోయినా సీమాంధ్రలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆయన పార్టీ భారీగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం. ఎంత ఆలస్యమైతే అంత నష్టం అని జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. అందువల్లే నేరుగా ప్రభుత్వాన్ని పడగొట్టలేని జగన్ తెలంగాణ నుండి నరుక్కొచ్చినట్లుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+