డిఎంకెకు ఖుష్బూ జిలుగులు
అంతేకాదు డిఎంకె గెలుపు కోసం తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో కూడా ఆమె ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే ఆమె ప్రచారం డిఎంకెకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. తమిళనాడు ఎన్నికలలో కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తానని చిరంజీవి సోమవారమే ప్రకటించారు. చిరంజీవి తెలుగు వారు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే కాకుండా పార్టీ అదేశిస్తే మిగిలిన ప్రాంతాల్లో కూడా ప్రచారం చేస్తానని చెప్పారు. విజయ్కాంత్ తదితరులు కూడా సినిమా నుండి రంగంలోకి దిగుతారు.
ఖుష్బూ డిఎంకే పార్టీలో ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆధ్వర్యంలో చేరింది. గత సంవత్సరం మే 15వ తారీఖున ఆమె పార్టీలో చేరింది. అయితే అంతకుముందు ఆమె కాంగ్రెసు పార్టీలో చేరతారనే వాదనలు వినిపించాయి. అయితే కరుణానిధి మంచి రచయిత. అయనకు సినీరంగంతో మంచి పరిచయాలున్నాయి. ఈ పరిచయాల కారణంగా ఖుష్బూ కాంగ్రెసులో కాకుండా డిఎంకెలో చేరింది. కాగా జయలలితకు దూరం జరిగిన వైగోతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధత వ్యక్తం చేస్తుంది.