జగన్ ఇష్యూ: కిరణ్పై హైకమాండ్ సీరియస్

నిజానికి, వైయస్ జగన్ వెంట కేవలం 18 మంది శానససభ్యులు మాత్రమే ఉంటారని ముఖ్యమంత్రి అంచనా వేశారని అంటున్నారు. ఆ సంఖ్య కూడా తగ్గుతుందని ఆయన చెప్పారట. అయితే, సమస్య ముదిరి జగన్పై సిబిఐ దర్యాప్తు సాగుతున్న క్రమంలో ఆ సంఖ్య 29కి చేరుకుంది. వారిలో 26 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. మిగతా ముగ్గురు కూడా జగన్ వెంటే ఉన్నప్పటికీ రాజీనామాలు చేయలేదు. ఈ సంఖ్యను తగ్గించడంలో కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు ఫలితాలు ఇవ్వలేదనే అసంతృప్తితో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.
ఆ సమస్య అలా ఉండగానే వైయస్ జగన్ వైపు మరో పది, 13 మంది వెళ్తారనే వార్తలు వచ్చాయి. జగన్ వర్గం ఆ విషయాన్ని ప్రచారంలో పెట్టింది. వివిధ కారణాల వల్ల మరింత మంది కూడా జగన్ వైపు వెళ్లడానికి సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, జగన్ భవిష్యత్తుపై ఆందోళనతోనే వారు అటు వెళ్లడం లేదు తప్ప అందులో కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిభ ఏమీ లేదని అంటున్నారు. వైయస్ జగన్ విమర్శలు తిప్పికొట్టడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శిస్తున్న వైఖరి ప్రోత్సాహకరంగా లేదని అంటున్నారు. ఏమైనా, రోశయ్య నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు తీసుకున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా పార్టీనీ, ప్రభుత్వాన్నీ గాడిలో పెట్టిన దాఖలు ఏవీ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications