వైయస్ జగన్ అభ్యర్థిపై నేదురుమల్లి రాజ్యలక్ష్మి

Nedurumalli Rajyalakshmi
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భార్య, మాజీ రాష్ట్ర మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నెల్లూరు లోకసభ స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ వెంట నడుస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి లోకసభ స్థానానికి చేసిన రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా మారింది.

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి పనిచేస్తూ వచ్చారు. అందువల్ల శాసనసభ ఎన్నికల్లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఓడిపోయారని అంటారు. అప్పటి నుంచి రాజ్యలక్ష్మి మౌనంగా ఉన్నారు. నెల్లూరు లోకసభ స్థానం ఖాళీ కావడంతో ఆమెలో మళ్లీ ఆశలు చిగురుస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో నేదురమల్లి జనార్దన్ రెడ్డికి బలమైన లాబీ ఉంది.

ఆనం సోదరులు ఓ వైపు, నేదురుమల్లి కుటుంబ మరో వైపు కాంగ్రెసు రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇరు వర్గాలకు మధ్య వైరం కూడా ఉంది. అయితే, ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ఆనం సోదరులు రాజ్యలక్ష్మికి లోకసభ టికెట్ రాకుండా అడ్డుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, ప్రస్తుత తరుణంలో మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కునే సత్తా రాజ్యలక్ష్మికి మాత్రమే ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెసు అధిష్టానం రాజ్యలక్ష్మి వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+