వైయస్ జగన్ అభ్యర్థిపై నేదురుమల్లి రాజ్యలక్ష్మి

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి పనిచేస్తూ వచ్చారు. అందువల్ల శాసనసభ ఎన్నికల్లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఓడిపోయారని అంటారు. అప్పటి నుంచి రాజ్యలక్ష్మి మౌనంగా ఉన్నారు. నెల్లూరు లోకసభ స్థానం ఖాళీ కావడంతో ఆమెలో మళ్లీ ఆశలు చిగురుస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో నేదురమల్లి జనార్దన్ రెడ్డికి బలమైన లాబీ ఉంది.
ఆనం సోదరులు ఓ వైపు, నేదురుమల్లి కుటుంబ మరో వైపు కాంగ్రెసు రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇరు వర్గాలకు మధ్య వైరం కూడా ఉంది. అయితే, ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ఆనం సోదరులు రాజ్యలక్ష్మికి లోకసభ టికెట్ రాకుండా అడ్డుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, ప్రస్తుత తరుణంలో మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కునే సత్తా రాజ్యలక్ష్మికి మాత్రమే ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెసు అధిష్టానం రాజ్యలక్ష్మి వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications