వైయస్ జగన్ అభ్యర్థిపై నేదురుమల్లి రాజ్యలక్ష్మి

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వైయస్ రాజశేఖర రెడ్డి పనిచేస్తూ వచ్చారు. అందువల్ల శాసనసభ ఎన్నికల్లో నేదురుమల్లి రాజ్యలక్ష్మి ఓడిపోయారని అంటారు. అప్పటి నుంచి రాజ్యలక్ష్మి మౌనంగా ఉన్నారు. నెల్లూరు లోకసభ స్థానం ఖాళీ కావడంతో ఆమెలో మళ్లీ ఆశలు చిగురుస్తున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో నేదురమల్లి జనార్దన్ రెడ్డికి బలమైన లాబీ ఉంది.
ఆనం సోదరులు ఓ వైపు, నేదురుమల్లి కుటుంబ మరో వైపు కాంగ్రెసు రాజకీయాలను నడిపిస్తున్నారు. ఇరు వర్గాలకు మధ్య వైరం కూడా ఉంది. అయితే, ప్రస్తుతం క్రియాశీలంగా ఉన్న ఆనం సోదరులు రాజ్యలక్ష్మికి లోకసభ టికెట్ రాకుండా అడ్డుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, ప్రస్తుత తరుణంలో మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఎదుర్కునే సత్తా రాజ్యలక్ష్మికి మాత్రమే ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీంతో కాంగ్రెసు అధిష్టానం రాజ్యలక్ష్మి వైపు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications