గర్ల్ ఆత్మహత్య: కోహ్లీ బాగా ఆడాలని ఆకాంక్ష
క్రికెట్ కెరీర్లో విరాట్ కోహ్లీ పలు మైలు రాళ్లు దాటుతాడని ఆమె ఆకాంక్షించింది. కోహ్లీ మంచి క్రికెటర్ అని, భవిష్యత్తులో రికార్డులు స్థాపిస్తాడని ఆమె అన్నది. ఆ అమ్మాయి బినాకు చెందిందని, భోపాల్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోందని భోపాల్ పోలీసులు చెప్పారు
ఆ అమ్మాయి ఉరేసుకుని మరణించింది. ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది అర్థం కావడం లేదని అంటున్నారు. అమ్మాయి విరాట్ కోహ్లీ అభిమాని అని, ఆ విషయాన్ని ఆమె సూసైడ్ నోట్లో రాసిందని పోలీసులు చెప్పారు.
తాను విరాట్ కోహ్లీ అభిమానని అని, భవిష్యత్తులో విరాట్ కోహ్లీని కలువలేనని అతనికి చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులను కోరింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత జట్టు పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించిన నేపథ్యంలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంతకు ముందు భారత జట్టు పాకిస్తాన్పై రెండు వన్డే మ్యాచులను ఓడిపోయింది.