రేపటినుంచే జియో ప్రైమ్ మెంబర్ షిప్.. మరిన్ని సర్ప్రైజింగ్ ఆఫర్లు!
రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ కు మారిన యూజర్లు ఏడాది పాటు రోజుకు 1జీబీ హై స్పీడ్ డేటాతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ సదుపాయం పొందుతారు.
ముంబై: రేపటి నుంచే జియో 'ప్రైమ్ మెంబర్ షిప్'ను రిలయన్స్ జియో ప్రారంభిస్తోంది. రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్ కు మారిన యూజర్లు ఏడాది పాటు రోజుకు 1జీబీ హై స్పీడ్ డేటాతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ సదుపాయం పొందుతారు.
దీనికి జియో యూజర్లు చేయాల్సిందల్లా ఒక్కటే. దగ్గరలోని జియో స్టోర్ కు గానీ, లేదా ఆన్ లైన్ లో గానీ ప్రైమ్ మెంబర్ షిప్ ను నమోదు చేసుకోవడమే. 2018 మార్చి వరకు జియో ప్రైమ్ యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
వీటిలోపాటు కొన్ని నెలవారీ ప్లాన్స్ కూడా జియో తన వినియోగదారులకు కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ప్రైమ్ యూజర్లకు మరో రెండు సరికొత్త ప్లాన్స్ కూడా అందించాలని జియో భావిస్తోంది.
నెలవారీ గడువుతో రూ.149, 499 ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. రూ.149 రీచార్జ్ పై రోజుకు 2జీబీ 4జీ డేటా... అలాగే రూ.499 రీచార్జ్ పై 60జీబీ డేటాను నెలరోజుల గడువుతో అందించాలని భావిస్తోంది.
జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువు పూర్తయ్యేలోపు ఈ రెండు ప్యాక్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేస్తాయి. జియో ప్రైమ్ ప్రోగ్రాం పేరుతో ఈ మంత్లీ ప్యాక్స్ ను జియో అందించనుంది. జియో ప్రైమ్ కు మారిన యూజర్లకే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.