సిద్దిపేట స్కీంలో ఎర్రన్నాయుడి పాత్ర: కెసిఆర్(పిక్చర్స్)
మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దివంగత తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడిపై ప్రశంసలు కురిపించారు. బుధవారం సిద్ధిపేటలో కెసిఆర్ పర్యటించిన సందర్భంగా తన మంత్రులందరికీ సిద్దిపేటలో తాగునీటి పథకం వెనుక దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడి కృషి ఉందని తెలిపారు.
1995లో చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో కేసీఆర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. అప్పుడు ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది. పెద్ద పెద్ద మంచినీటి పథకాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు లేవు. అదే సమయంలో 1996లో కేంద్రంలో ఏర్పడిన దేవెగౌడ మంత్రివర్గంలో తెలుగుదేశం చేరింది.
ఎర్రన్నాయుడుకు కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ లభించింది. ఆ సమయంలో కేసీఆర్ సిద్దిపేట మంచినీటి పథకం కోసం ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయించి ఎర్రన్నాయుడుకు అందజేశారు. ఎర్రన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానిని మంజూరు చేయించారు.
ఆ పథకం సిద్ధిపేట నియోజకవర్గంలో కేసీఆర్ ప్రతిష్ఠను బాగా పెంచింది. ఈ విషయంలో ఎర్రన్నాయుడు తనకు చాలా సాయం చేశారని, ఆయన మేలు మరవలేనని అప్పట్లో కేసీఆర్ పార్టీ సహచరుల వద్ద కూడా అనేవారని చెబుతారు.

కెసిఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దివంగత తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడిపై ప్రశంసలు కురిపించారు.

కెసిఆర్
బుధవారం సిద్ధిపేటలో కెసిఆర్ పర్యటించిన సందర్భంగా తన మంత్రులందరికీ సిద్దిపేటలో తాగునీటి పథకం వెనుక దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడి కృషి ఉందని తెలిపారు.

కెసిఆర్
1995లో చంద్రబాబునాయుడి మంత్రివర్గంలో కేసీఆర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు.

కెసిఆర్
అప్పుడు ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేది.

కెసిఆర్
పెద్ద పెద్ద మంచినీటి పథకాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద చాలినన్ని నిధులు లేవు. అదే సమయంలో 1996లో కేంద్రంలో ఏర్పడిన దేవెగౌడ మంత్రివర్గంలో తెలుగుదేశం చేరింది.

కెసిఆర్
ఎర్రన్నాయుడుకు కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ లభించింది. ఆ సమయంలో కేసీఆర్ సిద్దిపేట మంచినీటి పథకం కోసం ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయించి ఎర్రన్నాయుడుకు అందజేశారు.

కెసిఆర్
ఎర్రన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానిని మంజూరు చేయించారు. ఆ పథకం సిద్ధిపేట నియోజకవర్గంలో కేసీఆర్ ప్రతిష్ఠను బాగా పెంచింది.

కెసిఆర్
ఈ విషయంలో ఎర్రన్నాయుడు తనకు చాలా సాయం చేశారని, ఆయన మేలు మరవలేనని అప్పట్లో కేసీఆర్ పార్టీ సహచరుల వద్ద కూడా అనేవారని చెబుతారు.

కెసిఆర్
సిద్ధిపేట తాగునీటి ప్రాజెక్టు డిజైన్ను 90 శాతం తానే రూపొందించానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పదహారేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాను రఫ్గా చేసిన డిజైన్కు ఇంజనీర్లు సాంకేతిక అంశాలు జోడించి ప్రాజెక్టును పూర్తిచేశారని సీఎం వివరించారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications