జగన్ ఆశలు: టి నాయకులతో కీలక వ్యాఖ్యలు?

No Telangana!: YSRCP to leaders
విభజనపై కేంద్రం వేగంగా అడుగులు ముందుకు వేస్తోందని, దానిని ఆపలేమని ఓ వైపు సీమాంధ్ర కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు మాత్రం రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని భావిస్తున్నారు. దీనిని వారు గట్టిగానే చెబుతున్నారు. తనను కలిసిన వారితో కిరణ్ 2014 ఎన్నికల వరకు విభజన జరగదని చెబుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయనే ఆశతో ఉన్నారట. తనను కలిసిన వారితో సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశముందని వ్యాఖ్యానిస్తున్నారట. అదే సమయంలో అలా జరిగినా జరగకపోయినా పార్టీ సమైక్య నినాదం తీసుకుందని, అదే దారిలో నడవాలని చెబుతున్నారట. మరో విషయమేమంటే తెలంగాణ ప్రాంత నేతలకు కూడా జగన్ ఇదే విషయాన్ని చెబుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

పార్టీకి చెందిన పలువురు తెలంగాణ నేతలు జగన్‌ను కలుస్తున్నారు. ఈ సమయంలో ఆయన వారితో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారట. పార్టీ సమైక్య నినాదం తీసుకుందని కాబట్టి ఎవరు ప్రత్యేక తెలంగాణ అనవద్దని, దానివల్ల సీమాంధ్రలో పార్టీలో ఇబ్బందులు రావొచ్చునని చెబుతున్నారట!

తెలంగాణ ప్రభావం బలంగా ఉండని తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలపై, నియోజకవర్గాలపై జగన్ దృష్టి సారిస్తున్నారట. విభజన జరిగే అవకాశం లేదని చెబుతున్న జగన్... ఏం జరిగినా తెలంగాణ ప్రాంతంలోను పట్టు సాధించే దిశలో వెళ్తున్నారంటున్నారు. అందుకే ప్రత్యేక వాదం లేని జిల్లాలపై దృష్టి పెట్టారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+