హైద్రాబాద్లో జగన్ 'ఏపీ' వేడుక, బాబుపై..(పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నవంబర్ 1 ప్రాధాన్యతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్మరించారని, చరిత్రను స్మరించుకోకపోవడం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మండిపడ్డారు.
ఎందరో మనీయుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరపకూడదని చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో భావించారో అర్థం కాలేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకొని నవంబర్ 1నాడే అవతరణ వేడుకకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
లేదంటే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు నవంబర్ 1 నాడే కచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతుందని చెప్పారు. కాగా, జగన్ హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తల్లికి, పొట్టి శ్రీరాములుకు పూలమాల వేస్తున్న జగన్.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేస్తున్న జగన్.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ అభివాదం.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా కార్యకర్తలతో జగన్.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం వద్ద దృశ్యం.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములుకు పూలమార వేస్తున్న జగన్.
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేస్తూ..
ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాదులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు నవంబర్ 1 వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేస్తూ..
వైయస్సార్ కాంగ్రెస్
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ శనివారం అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్డులోని శ్రీరాములు విగ్రహానికి పార్యీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.