ఆర్బీఐలో వేతనం: టాప్లో లేని రాజన్, వారి కంటే చాలా తక్కువే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్కు ఆర్బీఐలో అత్యధిక వేతనం అని చాలామంది భావిస్తారు. కానీ ఆర్బీఐలో అత్యధిక వేతనం తీసుకునే వారిలో ఆయన నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన కంటే మరో ముగ్గురు ముందున్నారు.
తాజాగా వెలుగుచూసిన సమాచారం ప్రకారం ఆర్బీఐలో అత్యధిక వేతనం అందుకునేది రాజన్ కాదు.. రాజన్ కన్నా మరో ముగ్గురు ఎక్కువ వేతనం పొందుతున్నారని ఆర్బీఐ తాజాగా తెలిపింది.
అంతేకాదు డిప్యూటీ డైరెక్టర్లకన్నా ప్రిన్సిపల్ అడ్వయిజర్ వేతనం ఎక్కువని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నా కొందరు కిందిస్థాయి ఉద్యోగుల వేతనం అధికమని ఆర్బీఐ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐ ఈ సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచింది.

దీని ప్రకారం రఘురామ్ రాజన్ నెల జీతం రూ.1,98,700. ఇందులో బేసిక్ వేతనం రూ.90 వేలు. కాగా డీఏ రూ.1.01లక్షలు, ఇతరాలు రూ.7వేలుగా ఉన్నాయి. రాజన్ కన్నా అధికంగా వేతనం అందుకుంటున్న వారిలో ఆర్బీఐలో మరో ముగ్గురున్నారని తెలిపింది.
గోపాలకృష్ణ సీతారామ్ హెగ్డే(నెలసరి వేతనం రూ.4 లక్షలు), అన్నామలై అరాపులి (రూ.2.2లక్షలు), వీ కందసామి (రూ.2.1 లక్షలు)లు రఘురామ్ రాజన్ కన్నా అధిక వేతనం పొందుతున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఆర్బీఐతో పని చేస్తున్నదీ లేనిదీ వెల్లడించలేదు.
కేవలం వ్యక్తులు, వారి వేతనాలను మాత్రమే ఆర్బీఐ వెల్లడించింది. వారి హోదాలను తెలియజేయలేదు. గత సమాచారం ప్రకారం హెగ్డే ఆర్బీఐకి ప్రధాన న్యాయ సలహాదారుగా పని చేస్తున్నారు.
ఇక ఆర్బీఐలోని మరో ప్రిన్సిపల్ అడ్వయిజర్గా పని చేస్తున్న కిల్లావాలా వేతనం ఆర్బీఐలోని నలుగురు డిప్యూటీ గవర్నర్లు, 11 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కన్నా అధికమని తెలిపింది. అయితే, బేసిక్ విషయంలో మాత్రం రఘురామ్ రాజన్ టాప్లో ఉన్నారు. ఆర్బీఐలో 44 మంది ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications