గోల్కొండ కోటలోనే కేసీఆర్, సైన్యం కవాతు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. గోల్కొండ కోటలోని కొంత ప్రాంతం తమ ఆధీనంలో ఉందని, ఇందుకు అనుమతి తీసుకోలేదని ఆర్మీ రంగంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం లేఖ రాయడంతో.. గోల్కొండ కోటలోనే వేడుకలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం సిద్దించినందున పంద్రాగస్టు వేడుకలను అట్టహాసంగా గోల్కొండ కోటలో చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం పోలీసులు కవాతు కూడా చేశారు. సర్వే చేశారు. అయితే, బుధవారం అంతలోనే ఆర్మీ రంగంలోకి దిగింది.
తమ ఆధీనంలో ఉందని, అనుమతులు తీసుకోలేదని పహారా కాశారు. దీంతో వేడకలు గోల్కొండ కోటలో జరుగుతాయా అనే ఉత్కంఠ ఏర్పడింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని పురావస్తు శాఖకు అనుమతి కోసం లేఖ రాసింది. అవసరమైతే రక్షణ శాఖ అనుమతి కూడా కోరుతామని చెప్పింది. దీంతో అక్కడే వేడుకలు జరిగే అవకాశముంది. కాగా, గోల్కొండ కోటలోని రాణీ మహల్లో జెండాను ఎగరవేయనున్నారు.

సిద్ధమవుతున్న దృశ్యం
హైదరాబాదులోని గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం చేస్తున్న దృశ్యం. కోటలోని రాణీ మహల్లో జెండా ఎగురవేయాలని నిర్ణయించారని సమాచారం.

ఆర్మీ కవాతు
హైదరాబాదులోని గోల్కొండ కోటలోని తమ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించడం, ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధపడటం తెలిసిన ఆర్మీ రంగంలోకి దిగిన దృశ్యం.

ఆర్మీ కవాతు
హైదరాబాదులోని గోల్కొండ కోటలోని తమ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించడం, ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధపడటం తెలిసిన ఆర్మీ రంగంలోకి దిగిన దృశ్యం. తమకు చెందిన ప్రాంతంలో తమ అనుమతి లేకుండా కవాతు నిర్వహించవద్దని బుధవారం గోల్కొండ కోట వద్ద ఆర్మీ మోహరించిన దృశ్యం.

ఆర్మీ కవాతు
హైదరాబాదులోని గోల్కొండ కోటలోని తమ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించడం, ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధపడటం తెలిసిన ఆర్మీ రంగంలోకి దిగిన దృశ్యం.

ఆర్మీ కవాతు
హైదరాబాదులోని గోల్కొండ కోటలోని తమ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించడం, ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధపడటం తెలిసిన ఆర్మీ రంగంలోకి దిగిన దృశ్యం. తమకు చెందిన ప్రాంతంలో తమ అనుమతి లేకుండా కవాతు నిర్వహించవద్దని బుధవారం గోల్కొండ కోట వద్ద ఆర్మీ మోహరించిన దృశ్యం.

సిద్ధమౌతున్న దృశ్యం.
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు తొలుత సమస్యలు తలెత్తినా చివరకు సమసిపోయింది! గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు దాదాపు పదివేల మంది వరకు వస్తారని భావిస్తున్నారు.

ఆర్మీ కవాతు
హైదరాబాదులోని గోల్కొండ కోటలోని తమ ప్రాంతంలో పోలీసులు కవాతు నిర్వహించడం, ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధపడటం తెలిసిన ఆర్మీ రంగంలోకి దిగిన దృశ్యం.

సిద్ధమవుతున్న దృశ్యం
హైదరాబాదులోని గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం చేస్తున్న దృశ్యం. కోటలోని రాణీ మహల్లో జెండా ఎగురవేయాలని నిర్ణయించారని సమాచారం.












Click it and Unblock the Notifications