ధోనీకి అంతలేదు! కోహ్లీయే బెస్ట్ ఫినిషర్: గౌతం గంభీర్
కోల్కతా: భారత క్రికెట్ జట్టులో ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బెస్ట్ ఫినిషర్గా అందరూ భావిస్తారు. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం... తన దృష్టిలో విరాట్ కోహ్లీయే బెస్ట్ ఫినిషర్ అని చెబుతున్నాడు. మ్యాచ్ను ముగించడంలో మెరుగైనవాడు ధోనీ కాదని, కోహ్లీయే అని చెబుతున్నాడు.
మ్యాచ్ను ముగించడంలో ధోనీని మించిన ఆటగాడు లేడని మీడియానే ఓ ముద్ర వేసిందని, నా దృష్టిలో మాత్రం బెస్ట్ ఫినిషర్ విరాట్ కోహ్లియే అని చెప్పాడు. ఆరు లేదా ఏడో స్థానంలో వచ్చే ఆటగాడే మ్యాచ్కు ముగింపు ఇవ్వాలనేమీ లేదని, ఆ పని ఓపెనర్ కూడా చేయవచ్చునని చెప్పాడు.
ధోనీకి మీడియానే బెస్ట్ ఫినిషర్ అనే ట్యాగ్ ఇచ్చిందన్నాడు. కచ్చితంగా అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడో చెప్పాలన్నాడు. ఆరేడు ఏడు స్థానాల్లో వచ్చిన వారిని బెస్ట్ ఫినిషర్ అనాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ ఒక్కడే మెరుగ్గా ఆడితే సరిపోదని, జట్టు మొత్తం రాణిస్తేనే విజయం వరిస్తుందన్నాడు.
మరోవైపు, కోహ్లి మాత్రం ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ ధోనీయేనని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ... ధోని వచ్చాడు, ముగించాడు అన్నాడు. ప్రపంచంలోనే ధోని అత్యుత్తమ ఫినిషర్ అని, అందులో సందేహమే లేదని, శిఖర్ ధావన్ కూడా బాగా ఆడాడని చెప్పాడు.