కరెన్సీ సంక్షోభం జాతీయ విపత్తు: చంద్రబాబు, బ్యాంకర్లపై ఒత్తిడి మీద ఇలా...
ప్రస్తుత కరెన్సీ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ విపత్తుగా అభివర్ణించారు. దీన్ని అధిగమించడానికి ఉమ్మడి, సమన్వయ కృషి అవసరమని ఆయన అన్నారు.
అమరావతి: ప్రస్తుత కరెన్సీ సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ విపత్తుగా అభివర్ణించారు. దీన్ని అధిగమించడానికి ఉమ్మడి, సమన్వయ కృషి అవసరమని ఆయన అన్నారు. బ్యాంకర్లపై సోమవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు మంగళవారంనాడు కరెన్సీ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు.
బ్యాంకర్ల పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేయడానికి గల కారణాన్ని కూడా ఆయన చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను తొలగించడానికి మాత్రమే తాను బ్యాంకింగ్ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లు తెలిపారు.

"మీ మీద ఒత్తిడి పెడుతున్నాని మీరు అనుకోవద్దు. ప్రజలను సమస్యల నుంచి గట్టెక్కించడమే నా లక్ష్యం. దానివల్లనే మీ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకున్నాను. ప్రస్తుత కరెన్సీ సంక్షోభం జాతీయ విపత్తు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ సమస్యను పరిష్కరించాలి" అని చంద్రబాబు అన్నారు.
బ్యాంకర్లతో ఆయన మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయమూ సాయంత్రమూ సమీక్ష జరుపుతున్నప్పటికీ బ్యాంకర్లు సహకరించకపోవడంతో తాము నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోందని ఆయన సోమవారం అన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు వ్యాఖ్యలపై బ్యాంకర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో ఆయన వారిని చల్లబరిచేందుకే అన్నట్లుగా మంగళవారంనాడు మాట్లాడారు. రాష్ట్రంలో అందుబాటులో నగదు చాలా తక్కువగా ఉందని, సెల్ మిషన్లు కూడా తక్కువే ఉన్నాని, రాష్ట్రం సాంకేతికంగా ముందంజలో ఉందని, దాంతో డిసెంబర్ 1వ తేదీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ నగదు రహిత లావాదేవీలను నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications