KA Paul కళ్ళముందే ట్రంప్పై కాల్పులు! ప్రత్యక్ష సాక్షిగా షాకింగ్ నిజాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పాల్గొన్న ప్రతిష్ఠాత్మక విందు కార్యక్రమంలో కాల్పులు జరగడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. వాషింగ్టన్ డీసీలోని ప్రఖ్యాత హిల్టన్ హోటల్లో 'మీడియా రిపోర్టర్స్ కరస్పాండెంట్స్' డిన్నర్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 5 నుండి 6 రౌండ్ల కాల్పులు జరగడంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. అయితే, ఈ ప్రమాద సమయంలో తాను అదే హోటల్లో ఉన్నట్లు గ్లోబల్ పీస్ అంబాసిడర్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై కేఏ పాల్ స్పందిస్తూ.. తాను క్రమం తప్పకుండా బస చేసే హిల్టన్ హోటల్లోనే ఈ కాల్పులు జరిగాయని ధృవీకరించారు. "ట్రంప్ పాల్గొన్న డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు జరిగినప్పుడు నేను లోపలే ఉన్నాను. సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై ట్రంప్, వాన్స్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు, కానీ ఈ తరహా దాడులు జరగడం దురదృష్టకరం" అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న పాపం, అవినీతి, అక్రమాల వల్లే ఇటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..
ఇప్పుడే ప్రెసిడెంట్ ట్రంప్ గారు పాల్గొన్న విందులో ఈ ఘటన జరిగింది. నేను వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్లో ఉంటున్నాను, సాధారణంగా నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. కరస్పాండెంట్స్ డిన్నర్, మీడియా రిపోర్టర్స్ డిన్నర్ జరుగుతుండగా లోపల కాల్పులు (shooting) జరిగాయి. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నారు. కానీ లోకంలో పాపం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు ఎక్కువయ్యాయి. కాల్పుల ఘటనలు, యుద్ధాలు పెరిగిపోతున్నాయి. యుద్ధాలు ఆగిపోవాలని అందరూ ప్రార్థించండి. శాంతి స్థాపన కోసం నేను చేస్తున్న కృషి ఫలిస్తోంది. నేను ప్రతిపాదించిన 15 పాయింట్లకు ఇరు పక్షాల వారు అంగీకరించినట్లు సమాచారం అందింది. ఈ రోజు కూడా నేను యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. ఇరాన్ పార్లమెంట్ మినిస్టర్ గారు 'పాకిస్థాన్ నుంచి వెళ్ళిపోతే, మేము కేవలం కేఏ పాల్తోనే డీల్ చేస్తాం' అని చెప్పారు. ఇక్కడ అమెరికన్ నాయకులు సరిగ్గా కలవడం లేదు, అందుకే ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్న చర్చలు విఫలమవుతున్నాయి. వారికి శాంతి చర్చలు జరిపిన అనుభవం లేదు. నా సలహాలు తీసుకుంటున్నప్పటికీ, తమలో తాము మాట్లాడుకుంటున్నప్పటికీ.. వారిలో గర్వం, అహంకారం, సైతాను క్రియలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే నేను అన్ని పనులు మానుకుని రాత్రి పగలు వాషింగ్టన్ డీసీలోనే ఉంటున్నాను. ఎందుకంటే, యుద్ధాన్ని ఆపే ప్రధాన కేంద్రం (బటన్) ఇక్కడే ఉంది. మిస్టర్ ట్రంప్ గారు, నా మిత్రులు మరియు ఇతర నాయకులు అందరూ నా ప్రతిపాదనలకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక విజయం. లోక కల్యాణం కోసం మరొక్కసారి ప్రార్థించండి." - కేఏ పాల్.
Breaking : Shooting inside Prez Trump Dinner in Washington D C Hilto at Correspondents dinner . Pray for Peace for the wars to be stopped . Dr.K.A Paul pic.twitter.com/bDtfJDLq2P
— Dr KA Paul (@KAPaulOfficial) April 26, 2026
నా '15 పాయింట్ల' ఫార్ములాకు ఓకే!
ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణమే ఈ అనిశ్చితికి కారణమని పాల్ విశ్లేషించారు. శాంతి స్థాపన కోసం తాను చేస్తున్న కృషిని వివరిస్తూ.. "యుద్ధాలను ఆపడానికి నేను ఇచ్చిన 15 పాయింట్ల ప్రతిపాదనకు ట్రంప్ సహా ఇతర అమెరికన్ లీడర్స్ అంగీకరించారు. యుద్ధం ఆపే 'మెయిన్ బటన్' వాషింగ్టన్ డీసీలోనే ఉంది, అందుకే నేను ఇక్కడే ఉండి శాంతి చర్చలు జరుపుతున్నాను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా తనతో చర్చలకు సిద్ధంగా ఉన్నాయని, అయితే నాయకుల్లో ఉన్న అహంకారం వల్ల శాంతి ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆయన విమర్శించారు.
హోటల్ సెక్యూరిటీ గుప్పిట్లోకి..
మరోవైపు, కాల్పుల ఘటన తర్వాత అగ్రరాజ్యం అప్రమత్తమైంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే రంగంలోకి దిగి హోటల్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రంప్ లక్ష్యంగానే ఈ దాడి జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. ఒక అంతర్జాతీయ నేత పాల్గొన్న కార్యక్రమంలోనే ఇంతటి భద్రతా వైఫల్యం కలగడంపై అమెరికాలో తీవ్ర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications