Jaya Badiga: అమెరికాలో తెలుగు మహిళ జయ బాదిగ అరుదైన ఘనత
వాషింగ్టన్: ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలతో భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎన్నో కీలకమైన పదవులు, బాధ్యతలో కొనసాగుతున్నారు. తాజాగా, మరో తెలుగు మహిళ అరుదైన ఘనతను సాధించారు. అమెరికాలో తెలుగు మహిళ జయ బాదిగకు అరుదైన గౌరవం దక్కింది.
కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జీగా జయ బాదిగ నియమితులయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాలిఫోర్నియాలో జడ్జీగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. 2022 నుంచి ఇదే కోర్టులో కమీషనర్గా జయ కొనసాగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన జయ బాదిగ.. హైదరాబాద్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లిన జయ.. బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశారు. అనంతరం శాంటా క్లారా విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా అందుకున్నారు.
ఆ తర్వాత 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ ఎగ్జామ్ క్లియర్ చేశారు జయ. 10 ఏళ్లకు పైగా న్యాయవాద వృత్తిలో ప్రైవేట్ ప్రాక్టీస్ కొనసాగించారు. అంతేగాక, లాభాపేక్ష లేకుండా పలు కేసుల్లో ప్రభుత్వం తరఫున వాదించారు జయ. మరోవైపు, మెక్జార్జ్ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగాను పని చేశారు. తాజాగా, కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జీగా జయ బాదిగ నియమితులవడం తెలుగువారికి గర్వకారణంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications