లేఆఫ్స్ వేళ.. అద్దిరిపోయే వార్త చెప్పిన క్యాప్ జెమిని
Capgemini: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు దేశీయ ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు కోల్పోతున్న తరుణంలో.. భారీగా లేఆఫ్స్ తలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో క్యాప్ జెమినీ ఇండియా గుడ్ న్యూస్ ఇచ్చింది. భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టనున్నట్లు వెల్లడించింది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 40,000 నుండి 45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఐటీ రంగం నియామకాలలో సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగాలకు ఢోకా ఉండట్లేదా సంస్థలో.

దీనిపై ది హిందూ బిజినెస్ లైన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. ఈ కొత్త నియామకాలలో 35 నుంచి 40 శాతం మంది ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్లను తీసుకుంటుంది. కీలక డివిజన్లల్లోకి వారిని నియమించాలని భావిస్తోంది. మిగిలిన వాటిల్లో దేశంలో 50కి పైగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అంట ఫ్రెషర్స్ తోభర్తీ చేయనుంది.
దీనికోసం క్యాప్ జెమినీ ఆయా కళాశాలలతో భాగస్వామ్యం అయింది కూడా. AI- ఆధారిత మ్యాన్ పవర్ ను పెంచడమే సంస్థ ప్రధాన ఉద్దేశం. కొత్తగా చేరేవారికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వాలని కోరుకుంటోంది. తద్వారా వాళ్లు నేరుగా AI ప్రాజెక్టులపై పని చేయడానికి వీలవుతుందని అంచనా వేస్తోంది.
అంతేకాకుండా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరాల కోసం WNSను కొనుగోలు చేయాలని భావిస్తోన్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. మ్యాన్ పవర్ పరంగా క్యాప్ జెమినీకి ఇది అతిపెద్ద కొనుగోలు కానుంది. దీనికి ఇంకా రెగ్యులేటరీ ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.
WNS కు చెందిన ఏజెంటిక్ AI సొల్యూషన్స్ ను క్యాప్ జెమినీ ఇప్పటికే తన అనలిటిక్స్, కన్సల్టింగ్ డివిజన్ లో మెర్జ్ చేసినట్లు పేర్కొంది. దీనివల్ల ఇంటెలిజెంట్ ఆపరేషన్స్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్లో కంపెనీ సామర్థ్యాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ కొనుగోలు వల్ల 2027 నాటికి 100 నుండి 140 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలో సుమారు 1.75 లక్షల మంది ఉద్యోగులు ఉన్న క్యాప్ జెమినీ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇంటెల్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రైవ్.. ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications