AI టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..?
డేటా గోప్యత, సమాచార భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈరోజు (2025 డిసెంబర్ 21న ) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) ఒక ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక విధుల్లో ChatGPT, DeepSeek వంటి నియంత్రణలేని కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ను ఉపయోగించరాదని స్పష్టంగా ఆదేశించింది. ప్రభుత్వానికి చెందిన పరికరాలు, కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్క్లలో ఈ AI టూల్స్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించింది.
డేటా లీకేజీపై కేంద్రం ఆందోళన..
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రభుత్వ డేటా గోప్యత, జాతీయ భద్రత అని కేంద్రం స్పష్టం చేసింది. నియంత్రణ లేని లేదా విదేశీ సర్వర్లపై పనిచేసే AI టూల్స్లో సున్నితమైన సమాచారం నమోదు చేయడం వల్ల ప్రభుత్వ రహస్యాలు, పాలసీ డాక్యుమెంట్లు, ఆర్థిక వివరాలు, రక్షణ సంబంధిత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగులు తెలియకుండానే అధికారిక సమాచారం AI టూల్స్లో ఎంటర్ చేస్తే, అది శాశ్వతంగా సర్వర్లలో నిల్వ ఉండే అవకాశం ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చని పేర్కొంది.

అధికారిక పనుల్లో కఠిన మార్గదర్శకాలు..
- ప్రభుత్వ సమాచారాన్ని పూర్తిగా సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
- ఉద్యోగులు AI ఆధారిత సేవలను అధికారిక పనుల కోసం అత్యంత జాగ్రత్తగా మాత్రమే ఉపయోగించాలని
- ప్రభుత్వం అనుమతించిన, సురక్షితమైన డిజిటల్ టూల్స్కే పరిమితమవ్వాలని
- డేటా భద్రతా నియమావళి (Cyber Security Protocols) తప్పనిసరిగా పాటించాలని సూచించింది
- దేశానికి సంబంధించిన సమాచారం రక్షించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అని కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసింది.
భవిష్యత్తులో స్వదేశీ AI ప్రత్యామ్నాయాలు..?
ఇదే సమయంలో ప్రభుత్వం భవిష్యత్తులో దేశీయంగా అభివృద్ధి చేసిన సురక్షిత AI టూల్స్ను అధికారిక అవసరాల కోసం తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో, దేశ డేటా దేశంలోనే నిల్వ ఉండేలా రూపొందించిన AI ప్లాట్ఫార్మ్లపై దృష్టి సారిస్తున్నట్లు అధికారులు సంకేతాలు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ భద్రతా నిపుణులు సామాన్య ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా సమాచారం, ఫోటోలు, వీడియోలు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని AI టూల్స్లో ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్లోడ్ చేయవద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల డేటా దుర్వినియోగం, గుర్తింపు చోరీ (Identity Theft), సైబర్ మోసాలు జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. కృత్రిమ మేధస్సు వినియోగం వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో.. డేటా భద్రత, గోప్యత అత్యంత కీలక అంశాలుగా మారాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైనదైనా, సరైన నియంత్రణలు లేకుండా వాడితే అది భద్రతా ముప్పుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications