AP Inter Results 2024: ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల-ఫస్టియర్ 67, సెకండియర్ 78 శాతం పాస్..!
ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.. ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 67 శాతం మంది, ద్వితీయ సంవత్సరంలో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాల వారీగా ఫలితాలను విడుదల చేశారు. అలాగే వీటిని
ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ప్రైవేటు వెబ్ సైట్లలోనూఅందుబాటులో ఉంచారు.
ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణాజిల్లా టాప్ లో నిలిచింది. ఫస్టియర్ ఫలితాల్లో 84 శాతం, సెకండియర్ లో 90 శాతం ఫలితాలతో కృష్ణాజిల్లా టాప్ లో నిలిచింది. ఫస్టియర్ ఫలితాల్లో 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్దానంలో నిలిచింది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ నిర్వహించారు. ఇందులో ఫస్టియర్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. వీరికి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

ఇవాళ విడుదల చేసిన ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను అధికారికంగా విడుదల చేయగానే ఆన్ లైన్ లోనూ అప్ లోడ్ చేసారు. వీటిని ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుుసుకోవచ్చు. అక్కడ ప్రథమ సంవత్సరమా లేక ద్వితీయ సంవత్సరమా అనేది ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేశాక హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. ఆ తర్వాత స్కోరు కార్డును డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫలితాలను డిజీలాకర్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు.












Click it and Unblock the Notifications