AP SSC Results 2024: కాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు-ఇలా చెక్ చేసుకోండి..!
ఈ ఏడాది ఏపీలో విద్యాశాఖ నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యాశాఖ అధికారులు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సెస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇవాళ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నారు.

అధికారులు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయగానే..విద్యార్ధులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్
https://results.bse.ap.gov.in/లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ఇతర ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications