AP SSC Results 2024: కాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు-ఇలా చెక్ చేసుకోండి..!
ఈ ఏడాది ఏపీలో విద్యాశాఖ నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యాశాఖ అధికారులు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎస్సెస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతరం అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 18 నుంచి 30 వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇవాళ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది దాదాపు 6.3 లక్షల మందికి పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నారు.

అధికారులు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయగానే..విద్యార్ధులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్
https://results.bse.ap.gov.in/లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ తో పాటు పలు ఇతర ప్రైవేట్ వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications